Live Updates: ఈరోజు (సెప్టెంబర్-16) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 16 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | చతుర్దశి రా.7-03వరకు తదుపరి అమావాస్య | మఘ నక్షత్రం మ.12-07వరకు తదుపరి పుబ్బ | అమృత ఘడియలు: ఉ.9-47 నుంచి 11-20 వరకు తిరిగి తె.4-52 నుంచి | వర్జ్యం: రా.7-43 నుంచి 9-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-31 నుంచి 12-20 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-01

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 16 Sep 2020 7:15 AM GMT

    National updates:ఓబిసి క్రిమిలేయర్ పెంపుపై రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్న..

    జాతీయం..

    -ఓబిసి క్రిమిలేయర్ను 12 లక్షలకు పెంచే ప్రతిపాదన ఉందా అని ప్రశ్నించిన ఎంపీ

    -క్రిమిలేయర్ సవరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉందన్న మంత్రి కృష్ణ పాల్ గుర్జర్

  • High Court Of Andhra Pradesh: తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మంకి బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్..
    16 Sep 2020 7:12 AM GMT

    High Court Of Andhra Pradesh: తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మంకి బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్..

    అమరావతి (హైకోర్టు)..

    -నాలుగు రోజుల క్రితం నాన్ బెయిలబుల్ కేస్ పెట్టిన గుడివాడ పోలీసులు.

    -మంత్రి కొడాలి నాని పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ ఒక వ్యక్తి పిర్యాదుతో నాన్ బెయిలబుల్ కేస్ పెట్టిన పోలీసులు.

    -నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలిసిన అవసరం ఏంటి అని పోలీసులను ప్రశించిన హైకోర్ట్

    -నాదెండ్ల బ్రహ్మంని అరెస్ట్ చేయకుండా కేసు విచారణ చేసుకోవచ్చని పోలీసులకు సూచించిన హైకోర్ట్.

  • Amaravati updates: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
    16 Sep 2020 7:03 AM GMT

    Amaravati updates: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...

    అమరావతి..

    -డాక్టరుగా పేదలకు సేవచేయడంతో పాటు, పల్నాటి రౌడీ రాజకీయాలకు చికిత్సచేసి శాంతిని, అభివృద్ధిని అందించి, ఆరోగ్యకర సమాజానికి బాటలు వేసిన     పొలిటికల్ డాక్టర్ కీర్తిశేషులు కోడెల శివప్రసాదరావుగారు.

    -అవినీతిపరుల కక్షలు, కుట్రల కారణంగా ఆయన మనకు దూరమై ఏడాది గడిచింది.

    -మూడున్నర దశాబ్దాల రాజకీయజీవితంలో ఎన్‌టీఆర్‌, చంద్రబాబుగార్ల మంత్రి వర్గాల్లో పనిచేసి మచ్చలేని నాయకుడిగా పేరుపొందారు.

    -నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి శాసన సభాపతిగా తన వ్యక్తిత్వంతో ఆ పదవికే వన్నె తెచ్చారు.

    -కోడెలగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు..

  • 16 Sep 2020 6:59 AM GMT

    Vijayawada updates: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన బీజెపీ ఏపీ ఛీఫ్ సోము వీర్రాజు..

    విజయవాడ..

    -మరో అరగంట సేపు గవర్నర్ తో దేవాలయాలు, హిందువులపై దాడులు అంశంపై ఇరువురి మధ్య చర్చ..

    -హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న సోము వీర్రాజు..

  • 16 Sep 2020 6:57 AM GMT

    Vijayawada updates: రధానికి భద్రత కల్పించే చర్యల్లో భాగంగా అధికారులు కార్పెట్ ని తెరిచి చూసే సమయంలో సింహాలు కనిపించలేదు..వెల్లంపల్లి శ్రీనివాసరావు..

    విజయవాడ..

    వెల్లంపల్లి శ్రీనివాసరావు దేవాదాయ శాఖా మంత్రి..

    -వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రథాన్ని ఉపయోగించలేదు..

    -గత ప్రభుత్వం హయాంలో జరిగిందో ఇప్పుడు జరిగిందో విచారణలో తేలుతుంది

    -ఘటనపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తాం

    -సెక్యూరిటీ ఏజెన్సీ కి దేవాలయం భద్రతా అప్పగించాం..

    -సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతాలోపం అని తేలితే దానిపై చర్యలు తీసుకుంటాం

    -ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయి

    -అంతర్వేది ఘటన తరువాత అన్ని దేవాలయాల్లో భద్రతా చర్యలు తీసుకుంటున్నాం..

  • Srisailam project updates: శ్రీశైల జలాశయానికి  గంట గంట కు కొనసాగుతున్న వరద ప్రవాహం..
    16 Sep 2020 6:50 AM GMT

    Srisailam project updates: శ్రీశైల జలాశయానికి గంట గంట కు కొనసాగుతున్న వరద ప్రవాహం..

    కర్నూలు జిల్లా శ్రీశైలం

    -ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుండి 1,59,307 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 24,816 క్యూసెక్కులు హంద్రీ నుండి 250 క్యూసెక్కులు వరద నీరు   శ్రీశైల జలాశయానికి చేరిక

    -8 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,24,600 క్యూసెక్కుల వరద నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు

    -టోటల్ ఇన్ ఫ్లో 1,84,373 క్యూసెక్కులు

    -అవుట్ ఫ్లో 2,54,088 క్యూసెక్కులు

    -ప్రస్తుత నీటి మట్టం 885.000 అడుగులు

    -పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు

    -ఆంద్రప్రదేశ్ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 7 జనరేటర్ల ద్వారా ముమ్మరంగా విద్యుదుత్పత్తి

    -పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టిఎంసిలు

    -ప్రస్తుత నీటి నిల్వ 215.8070 టిఎంసిలు.

  • 16 Sep 2020 6:31 AM GMT

    Visakha updates:-పరపవిత్రమైన క్షేత్రం శ్రీ కాళహస్తి క్షేత్రం..శ్రీనివాసనంద సరస్వతి..

    విశాఖ..

     -ఏపి సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి కామెంట్స్..

    -ఇక్కడ నంది విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించారు?

    -ఈ ఘటనకు పాల్పడింది ఎవరు?

    -తాజాగా ఇంద్రకీలాద్రి కనక దర్గా అమ్మవారి రధం వెండి విగ్రహాలు మాయం అయ్యాయి.

    -దీనిపై కూడా సీబీఐ విచారణ జరిపించాలి.

    -దేవాలయాల్లో సి సి కెమెరా ఏమి అయ్యాయి?

    -ఇన్ని ఘటనలు జరుగుతున్నా,సీఎం, దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు స్పందించరు?

    -దేవాలయాల భద్రత పై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.

    -దేవాలయాలపై కుట్ర జరుగుతోంది.

    -రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్న దేవాదాయ శాఖ మంత్రికి సిగ్గు లేదు.. వెంటనే రాజీనామా చేయాలి.

    -ఈ ప్రభుత్వం మైనార్టీల కోసమే ఉందా?

    -జగన్ సర్కార్ లో హిందువులు లేరా? ఉంటే ఎందుకు మాట్లాడడం లేదు?

    -ఇన్ని ఘటనలు జరుగుతున్నా, జగన్ ఎందుకు మాట్లాడారు?

  • Vijayawada updates: ఈ రోజు కార్ వార్త అనే కార్యక్రమంలో అమ్మవారి ఆలయంలో ఉన్న రథానికి అధిక ప్రాధాన్యత ఉంది..సోము వీర్రాజు..
    16 Sep 2020 6:24 AM GMT

    Vijayawada updates: ఈ రోజు కార్ వార్త అనే కార్యక్రమంలో అమ్మవారి ఆలయంలో ఉన్న రథానికి అధిక ప్రాధాన్యత ఉంది..సోము వీర్రాజు..

    విజయవాడ:-

    సోము వీర్రాజు,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు:-

    -ఉత్సవాల్లో భాగంగా ఈ రథాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.

    -ఈ రథం ఖరీదు 15 లక్షలు.

    -ప్రస్తుతం రథంలో సింహాలు ఒకటే ఉంది.

    -రథానికి ఉన్న ఒక సింహం బొమ్మ బ్రేక్ చేసిన విధంగా ఉంది.

    -ఇది ఆలయానికి సంబంధించిన సిబ్బంది నిర్లక్ష్యం.

    -ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అనే చోట్ల జరుగుతున్నాయి.

    -హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం ఇప్పటికయినా చర్యలు తీసుకోవాలి.

    -ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి భాద్యుల పై వెంటనే చర్యలు తీసుకోవాలి అని బీజేపీ డిమాండ్ చేస్తుంది.

  • Vijayawada updates: ఇంద్రకీలాద్రిపై నిన్న వివాదం కారణం అయ్యిన వెండి రథం సందర్శించనున్న పలువురు రాజకీయ నాయకులు..
    16 Sep 2020 6:18 AM GMT

    Vijayawada updates: ఇంద్రకీలాద్రిపై నిన్న వివాదం కారణం అయ్యిన వెండి రథం సందర్శించనున్న పలువురు రాజకీయ నాయకులు..

    విజయవాడ..

    -బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ యంయాల్సి బుద్ధ వెంకన్న వెండి రథాన్ని పరిశీలించనున్నారు

    -ఈవో పొంతన లేని మాటలకు రాజకీయ నాయకుల సందర్శనతో క్లారిటీ వచ్చే అవకాశం

  • Rajahmundry updates: ఏలేశ్వరం లోని ఏలేరు జలాశయానికి 4వేల క్యూసెక్కులకు తగ్గిన వరద ఇన్ఫ్లో..
    16 Sep 2020 6:13 AM GMT

    Rajahmundry updates: ఏలేశ్వరం లోని ఏలేరు జలాశయానికి 4వేల క్యూసెక్కులకు తగ్గిన వరద ఇన్ఫ్లో..

    తూర్పుగోదావరి -రాజమండ్రి..

    -ప్రస్తుతం గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్న 8వేల క్యూసెక్కులు 6వేలకు కుదింపు

    -నాల్గవ రోజు ముంపులోనే కొనసాగుతున్న కిర్లంపూడి,జగ్గంపేట, ప్రత్తిపాడు , గొల్లప్రోలు, పిఠాపురం యు.కొత్తపల్లి మండలాల్లో పలు గ్రామాల వరిపొలాలు

    -కిర్లంపూడిలో రాజుపాలెం, ముక్కొల్లు, వీరవరం, ఎస్.తిమ్మాపురం గ్రామాల్లో ఏలేరు ప్రధాన కాల్వకు గండ్లు

    -పిఠాపురంలో మాధవరం, రాపర్తి, వీరరాఘవపురంలో గొర్రికండి కాల్వకు గండ్లు

    -భారీవర్షాలు,వరదల వల్ల జిల్లాలో 25 మండలాల్లో 130 గ్రామాలపై ముంపు ప్రభావం

    -7వేల719 హెక్టార్లలో వరి, 192 హెక్టార్లలో ప్రత్తి, ఇతర అరటి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం కలిగించిందని అంచనా

    -నాల్గవ రోజు జిల్లాలో పడుతున్న వర్షాలు...

    -అన్నవరం పంపా రిజర్వాయరు నుంచి 900 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

Print Article
Next Story
More Stories