Live Updates: ఈరోజు (సెప్టెంబర్-16) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 16 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | చతుర్దశి రా.7-03వరకు తదుపరి అమావాస్య | మఘ నక్షత్రం మ.12-07వరకు తదుపరి పుబ్బ | అమృత ఘడియలు: ఉ.9-47 నుంచి 11-20 వరకు తిరిగి తె.4-52 నుంచి | వర్జ్యం: రా.7-43 నుంచి 9-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-31 నుంచి 12-20 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-01
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 16 Sept 2020 11:37 AM IST
Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న వైజాగ్ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ..
తిరుమల..
-రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ వాటాలపై పార్లమెంటులో పోరాడాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు
-మొత్తం 17 అంశాలపై పార్లమెంటులో ఎలా వ్యవహరించాలో సూచించారు
-పార్టీ స్టాండ్ ప్రకారం దేశ భద్రత, కరోనా, చైనా వంటి అంశాలపై ప్రస్తావిస్తాం
-పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెడుతున్న కొన్ని బిల్లుల్లో ఇబ్బందులు ఉండటంతో వాటిని ప్రస్తావిస్తాం
-రఘురామకృష్ణంరాజు జగన్ దయతో గెలిచి అవివేకంతో ప్రవర్తిస్తున్నాడు
- 16 Sept 2020 11:32 AM IST
Guntur District updates: కోడెల వర్ధంతి కి మేము వ్యతిరేకం కాదు..అంబటి రాంబాబు..
గుంటూరు:....
.సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు..
-కోడెల శివప్రసాదరావు వర్ధంతిని అడ్డగిస్తున్నమని మా పై బురద చల్లటం సరికాదు
-వర్ధంతిని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూడటం అన్యాయం
-కోవిడ్ నిబంధనల ప్రకారం చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు
-రేపు వావిలాల గోపాలకృష్ణ జన్మిందిన వేడుకల్ని మేము భౌతిక దూరం పాటిస్తూ జరుపుతాం
- 16 Sept 2020 11:29 AM IST
Guntur District updates: నేడు ఏపి అసెంబ్లీ తొలి స్పీకర్ కోడెల ప్రధమ వర్దంతి...
గుంటూరు ః..
-నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలలో వర్దంతి కార్యక్రమాలు.
-పాల్గోనున్న కోడెల తనయుడు కోడెల శివరాం, పలువురు టిడిపి నేతలు.
- 16 Sept 2020 11:27 AM IST
Kadapa District updates: ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామం వద్ద విషాదం..
కడప :
-గాలేరు నగరి కాలువలోపడి ఇద్దరు ఆత్మహత్య
-మృతులు అనంతపురం జిల్లా,యన్. పి కుంటా మండలం మర్రికొమ్మదిన్నె గ్రామస్థులుగా గుర్తించిన పోలీసులు
-మృతురాలు కవిత(24) గ్రామవాలెంటీర్ గా పనిచేస్తుండగా... ఉపాధి నిమిత్తం కువైట్ లో ఉంటున్న భర్త
-మరొ మృతుడు గ్రామ వి.ఆర్.ఏ గా పనిచేస్తున్న కార్తీక్...ఇటీవల పెళ్లి సంబంధం చూసిన పెద్దలు...
-మృతులు ఇద్దరూ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటుండగా...ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారంటూ అత్మహత్య...
-కేసునమోదు చేసి విచారణ చేపట్టిన పోలీలు..
- 16 Sept 2020 11:25 AM IST
Amaravati updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ.
అమరావతి..
-రాష్ట్రంలో తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకై చర్యలు చేపట్టండి.
-ఇళ్ల స్థలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 43 వేల ఎకరాల భూములను సేకరించారు.
-కేవలం 4 వేల ఎకరాల భూములకు సంబంధించి మాత్రమే వివాదాలు తలెత్తాయి.
-మిగిలిన 39 వేల ఎకరాల భూములను తక్షణమే పంపిణీ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు?
-పేదలకు ఇళ్ల స్థలాలకై పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున కేటాయించండి.
-తెలంగాణ రాష్ట్ర తరహాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వండి.
-ఏపీ టిడ్ కో ఆధ్వర్యంలో నిర్మించిన 6 లక్షల గృహాలకు ఇప్పటికైనా తుది మెరుగులు దిద్ది లబ్ధిదారులకు ఇచ్చేందుకు చర్యలు చేపట్టండి.
- 16 Sept 2020 11:21 AM IST
Anantapur district updates: వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద రాత్రి విద్యుత్ సబ్ స్టేషన్ లో మంటలు..
అనంతపురం :
-వజ్రకరూరు మండలం రాగులపాడు 8వ పంప్ హౌస్ వద్ద రాత్రి విద్యుత్ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగి సంకేతిక సమస్య వల్ల హంద్రీనీవా కు అగిపోయ పంపింగ్...
-పంపింగ్ అగిపోవడంతో చాయాపురం వద్ద హంద్రీనీవా కాలువ నిండిపోయి బయటకు వృధాగా పోతున్న కృష్ణ జలాలు.
-నీటి ఉదృతంగా ప్రవాహిస్తుడంతో వాహనదారులను అప్రమత్తం చేసిన అధికారులు.
-ఉరవకొండ,హోతూరు, చాయపురం, కొనకొండ్ల, గుంతకల్లు పోవు వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
- 16 Sept 2020 11:12 AM IST
Rajahmundry updates: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కొత్త రథాన్ని వచ్చే సంక్రాంతికి సిద్ధం చేసేలా కసరత్తు..
తూర్పుగోదావరి - రాజమండ్రి-
-అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, ప్రత్యేక అధికారి, ఏడీసీ రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష
-నూతన రథం నిర్మాణంపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఛైర్మన్ గా సబ్ కలెక్టర్ కౌశిక్
-2021 ఫిబ్రవరిలో జరిగే స్వామివారి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే సంక్రాంతికి నూతన రథాన్ని నిర్మించాలని నిర్ణయం
-రథం నిర్మాణానికి వాడే కలప స్వచ్ఛమైన నాణ్యమైన బస్తర్ టేకు రావులపాలెం టింబర్ డిపోలో గుర్తింపు
-రథానికి అవసరమైన కలపను ఈనెల 19 నుంచి తగిన పరిమాణంలో కోయించే ప్రక్రియ
-నూతన రథం పాత రథం మాదిరిగానే పూర్వవైభవం ఉట్టుపడేలా వుంటుదంటున్న దేవదాయశాఖ అధికారులు..
- 16 Sept 2020 7:33 AM IST
Srisailam Project Updates: శ్రీశైలం జలాశయంలో కొనసాగుతున్న వరద ప్రవాహం
- 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
- ఇన్ ఫ్లో: 1,73,726 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో: 1,47,500 క్యూసెక్కులు
- స్పిల్ వే:4×10=1,12,300
- A P పవర్ ప్లాంట్:31,137
- పోతిరెడ్డిపాడు:1896
- హంద్రినివా:1688
- కల్వకుర్తి:800
- పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
- ప్రస్తుతం నీటి మట్టం : 885.00 అడుగులు
- పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
- ప్రస్తుతం: 215.8070 టీఎంసీలు
- కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 16 Sept 2020 7:27 AM IST
Corona positive : 108 ను దగ్ధం చేసిన కోవిడ్ అనుమానితుడు
ప్రకాశం జిల్లా...
- ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ ఎదుట 108 అంబులెన్స్ ని దగ్దం చేసిన కోవిడ్ అనుమానిత రోగి సురేష్.
- ఓ కేసులో ముద్దాయిగా విచారణ కోసం తాలూకా పోలీస్ స్టేషన్ కి తెచ్చిన పోలీసులు.
- పోలీసు స్టేషన్లో పాయిజన్ సేవించడం 108 కాల్ సెంటర్ కి కాల్ చేసిన పోలీసులు.
- 108 వాహనం ఎక్కి వాహనం అద్దాలు పగులగొట్టి వాహనం లో ఉన్న స్పిరిట్ తో వాహనం ను దగ్దం చేసిన రోగి సురేష్..







