Live Updates: ఈరోజు (సెప్టెంబర్-16) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 16 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | చతుర్దశి రా.7-03వరకు తదుపరి అమావాస్య | మఘ నక్షత్రం మ.12-07వరకు తదుపరి పుబ్బ | అమృత ఘడియలు: ఉ.9-47 నుంచి 11-20 వరకు తిరిగి తె.4-52 నుంచి | వర్జ్యం: రా.7-43 నుంచి 9-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-31 నుంచి 12-20 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-01

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Guntur updates: అమ్మవడి కార్యక్రమం ద్వారా పదమూడు లక్షల మంది మహిళలు లబ్ది పొందారు..హోం మంత్రి సుచరిత..
    16 Sep 2020 8:39 AM GMT

    Guntur updates: అమ్మవడి కార్యక్రమం ద్వారా పదమూడు లక్షల మంది మహిళలు లబ్ది పొందారు..హోం మంత్రి సుచరిత..

    గుంటూరు...

    హోం మంత్రి సుచరిత కామెంట్స్...

    -కరోనా తో ఇబ్బందులు పడుతున్నా 14 వందల కోట్ల రూపాయలు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చారు.

    -హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నెరవేర్చుతున్నారు.

    -అరవై ఐదు వేల కోట్లను రూపాయలను ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చింది.

    -రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసింది వైయస్ రాజశేఖర రెడ్డి అయితే దానిని అభివృద్ధి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్.

    -గత ప్రభుత్వన్ని నమ్మి డ్వాక్రా మహిళలు మోసపోయారు.

    -ప్రతీ కుటుంబంలో లబ్ది పొందిన వాళ్ళు ఉన్నారు...వాళ్ళంతా ముఖ్యమంత్రి కి అండగా ఉంటారు.

  • Srikakulam updates: జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి..
    16 Sep 2020 8:13 AM GMT

    Srikakulam updates: జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి..

    శ్రీకాకుళం జిల్లా..

    -జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి..

    -కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష, టిడిపి నాయకులు..

    -కోడెల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలుగుదేశం నేతలు..

  • Botcha Satyanarayana Comments: వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ..
    16 Sep 2020 8:10 AM GMT

    Botcha Satyanarayana Comments: వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ..

    బొత్స కామెంట్స్..

    - పరీక్షల నిర్వహణలో 77,558 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.

    - పరీక్షా కేంద్రాలకు ఆర్టీసి నుంచి బస్సులను నడపాలి

    - ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్ కూడా అందుబాటులో వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

    - కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ 19 నిబంధనల ప్రకారం భౌతిక దూరం తప్పని సరిగా పాటించాలి.

    - పరీక్ష కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద ధర్మల్ స్కానర్ తప్పనిసరి

    - జిల్లా కలెక్టర్లు, జెసిలు, ఎస్పీలు పరీక్షలు సజావుగా జరిగేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలి

    - గత ఏడాది ఏ రకంగా పకడ్భందీగా పరీక్షలు నిర్వహించారో, అదే విధంగా ఎటువంటి ఆరోపణలకు అవకాశం లేకుండా పరీక్షలు జరగాలి.

  • Vizianagaram updates: విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం..
    16 Sep 2020 8:00 AM GMT

    Vizianagaram updates: విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం..

    విజయనగరం..

    -అరకు నుంచి ఒడిశా రాష్ట్రం రాయఘడ కు అక్రమంగా తరలిపోతున్న గంజాయిని పట్టుకున్న కొమరాడ పోలీసులు

    -పార్వతీపురం వైపు నుంచి రాయఘడ రోడ్డులో లారీలో తరలిపోతున్న గంజాయి

    -కొమరాడ వద్ద రహదారి గోతుల కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవటంతో లారీలో గంజాయిని గుర్తించిన పోలీసులు

    -సుమారు కోటి 20 లక్షల రూపాయల విలువ చేసే 675 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

  • Amaravati updates: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్..
    16 Sep 2020 7:57 AM GMT

    Amaravati updates: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్..

    అమరావతి..

    పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్..

    -తాడేపల్లి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పోస్ట్‌ల భర్తీపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పెద్దిరెడ్డి     రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్

    - వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్ కమిషనర్ గిరిజాశంకర్, మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్           కమిషనర్ విజయ్ కుమార్, తదితరులు

    - కోవిడ్ నేపథ్యంలో సచివాలయ పోస్ట్‌ల భర్తీలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి

    - 16,208 ఖాళీ పోస్టులకు 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారు.

    - ఈనెల 20 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి.

    - మొత్తం 7 రోజుల పాటు 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం.

    - 20వ తేదీన 6,81,664 మంది పరీక్షలకు హాజరు కానున్నారు.

    - మొదటి రోజు ఉదయం 2,221 కేంద్రాలు...

    - మధ్యాహ్నం 1068 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశాం.

    - కరోనా పాజిటీవ్ వున్న అభ్యర్ధులకు ఐసోలేషన రూంలను సిద్దం చేశాం.

    - పిపిఇ కిట్‌లతో ఐసోలేషన్ రూంలో ఇన్విజిలేషన్

  • Vijayawada updates: మంత్రి వెల్లంపల్లిని భర్తరఫ్ చేయాలి..దేవినేని ఉమామహేశ్వరరావు..
    16 Sep 2020 7:46 AM GMT

    Vijayawada updates: మంత్రి వెల్లంపల్లిని భర్తరఫ్ చేయాలి..దేవినేని ఉమామహేశ్వరరావు..

    విజయవాడ..

    దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి..

    -ఈవో బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు.

    -సింహాలు పోయాయి అని క్లియర్ గా కనిపిస్తుంటే ఇంకా ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారు.

    -Ias స్థాయి అధికారిని మార్చి ఎందుకు కింద స్థాయి అధికారిని ఈవో గా తీసుకువొచ్చారు.

    -వెంటనే ఈవో ని సస్పెండ్ చేసి ఒక పూర్తి స్థాయి జ్యూడిషల్ దర్యాప్తు చేయాలి.

    -ఈ 16 నెలల్లో జరిగిన అన్ని ఘటనలను అన్ని సీబీఐ చేస్తా విచారణ చేపించాలి.

    -దేవాలయాలు, చర్చ, మసీదులు పై దాడులను టీడీపీ తీవ్రంగా కండిస్తుంది.

    -24 గంటలు గడుస్తున్నా ఇప్పటివరకూ పోలీస్ కేస్ పెట్టలేదు.

    -భక్తుల మనోభావాలు కాపాడాల్సిన భద్యత మంత్రికి, ప్రభుత్వానికి లేదా ?

    -ఈ ఘటనల పై వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి.

    -నిందితులను కాపాడాలనే ప్రయత్నం ఇక్కడ అధికారులు, మంత్రి చేస్తున్నారు.

    -రాష్ట్రంలో అన్ని ప్రముఖ దేవాలయాలలో ఇలాంటి దాడులు జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది.

  • 16 Sep 2020 7:34 AM GMT

    Amaravati updates: కోడెల శివప్రసాదరావు ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులు.. నారా చంద్రబాబు నాయుడు..

    అమరావతి..

    -టీడీపీ జాతీయ అధ్యక్షులు, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు..

    -డాక్టరుగా పలనాటి ముద్దుబిడ్డ అయ్యారు.

    -రాజకీయ నేతగా పల్నాటి పులి అనిపించుకున్నారు.

    -36ఏళ్ళ పాటు తెలుగుదేశం పార్టీతో ఉండి ప్రజల కష్టనష్టాలలో అండగా నిలిచిన నేత కోడెల శివప్రసాదరావు గారు.

    -అటువంటి నేత ఈరోజు మనమధ్య లేకపోవడం రాష్ట్ర రాజకీయాలకే తీరనిలోటు. 

    -కోడెల ప్రజాసేవ గురించి కోటప్పకొండ ఆలయం చెబుతుంది.

    -స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కన్వీనర్‌గా నరసరావుపేట, సత్తెనపల్లిలో రికార్డుస్థాయిలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమాలు ఆయన పట్టుదలకు నిదర్శనం.

    -అవయవదాన కార్యక్రమాన్ని సామూహిక కార్యక్రమం చేసిన ఘనత కోడెలది.

    -ఏపీ శాసనసభ తొలి సభాపతిగా ఆయన నిర్వహించిన పాత్ర ఆదర్శనీయం.

  • Vijayawada updates: విజయవాడ రూరల్ నిడమానురు సాయి బాబా గుడి వద్ద ఉద్రిక్తత.....
    16 Sep 2020 7:30 AM GMT

    Vijayawada updates: విజయవాడ రూరల్ నిడమానురు సాయి బాబా గుడి వద్ద ఉద్రిక్తత.....

    కృష్ణాజిల్లా:

    -బీజేపీ, జనసేన పార్టీ నాయకులు గుడివద్ద నిరసన తెలియజేస్తుంటే వారిపై దాడికి దిగిన స్థానిక వైసీపీ నాయకులు, గ్రామస్తులు

    -మా గ్రామంలో సమస్య పరిష్కారం చేసుకుంటాం మీరు ఈ విషయాన్ని ఎక్కువ చేయకండి అని బాహా బాహి కి దిగిన స్థానిక వై.సి.పి.నాయకులు.

    -రంగంలోకి దిగిన పోలీసులు,ఇరు వర్గాల కు సర్ది చెప్పిన పోలీసులు

  • 16 Sep 2020 7:26 AM GMT

    Antarvedi updates: అంతర్వేది మీద దుర్మార్గం చేసిన వారిపై చర్యలు లేవు..విశ్వహిందూ పరిషత్, రవి..

    విశ్వహిందూ పరిషత్, రవి..

    -రాజమండ్రిలో వినాయక విగ్రహం, దుర్గాదేవి మందిరంలో సింహాల అపహరణ, శ్రీకాళహస్తిలో ఆలయ పవిత్రతకు భంగం

    -హిందూ దేవాలయాలపై అపచారం విషయంలో అఖిలపక్ష సమావేశం వేయాలి

    -హిందూ ధర్మ ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలి

    -అంతర్వేదిలో కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

  • Vijayawada updates: అంతర్వేది అంశంపై ఉవ్వెత్తున అందరూ ప్రజలూ వెళ్ళారు..సోము వీర్రాజు..
    16 Sep 2020 7:24 AM GMT

    Vijayawada updates: అంతర్వేది అంశంపై ఉవ్వెత్తున అందరూ ప్రజలూ వెళ్ళారు..సోము వీర్రాజు..

    విజయవాడ..

    బీజెపి ఏపీ ఛీఫ్, సోము వీర్రాజు..

    -జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ శ్రీకాకుళం, ప్రకాశం, అంతర్వేది అంశాలపై చర్యలు తీసుకోలేదు

    -హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పవిత్రతపై అనుమానం ఉంది

    -41 మంది యువకులపై కేసులు పెట్టారు

    -చర్చి మీద రాళ్ళు వేసిన దుండగులు పారిపోయారు

    -అంతర్వేది అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే యువకులను అరెస్టు చేసారు

    -ప్రభుత్వం హిందూత్వం పై వ్యతిరేకత చూపిస్తుండడంపై బీజెపీ ఉద్యమం

    -ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం

    -గవర్నర్ ద్వారా ఈ అంశంపై ఒత్తిడి తెచ్చేలా మాట్లాడాము

Print Article
Next Story
More Stories