Live Updates: ఈరోజు (సెప్టెంబర్-16) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-16) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 16 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | చతుర్దశి రా.7-03వరకు తదుపరి అమావాస్య | మఘ నక్షత్రం మ.12-07వరకు తదుపరి పుబ్బ | అమృత ఘడియలు: ఉ.9-47 నుంచి 11-20 వరకు తిరిగి తె.4-52 నుంచి | వర్జ్యం: రా.7-43 నుంచి 9-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-31 నుంచి 12-20 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-01

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • MP Balli Durga Prasad: తిరుప‌తి ఎంపీ మృతిపై టిటిడి ఛైర్మ‌న్ సంతాపం
    16 Sep 2020 4:05 PM GMT

    MP Balli Durga Prasad: తిరుప‌తి ఎంపీ మృతిపై టిటిడి ఛైర్మ‌న్ సంతాపం

    - తిరుప‌తి పార్ల‌మెంటు స‌భ్యుడు శ్రీ బ‌‌ల్లి దుర్గాప్ర‌సాద్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ బాధ్యులు(రీజ‌న‌ల్ ఇన్‌చార్జ్‌),   శ్రీ వైవి.సుబ్బారెడ్డి బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో సంతాపం వ్య‌క్తం చేశారు. శ్రీ దుర్గాప్ర‌సాద్ అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుప‌త్రిలో మృతి చెందారు.

    - సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న‌ శ్రీ దుర్గాప్ర‌సాద్ మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్ర‌జ‌ల‌కు విశేష సేవ‌లందించార‌ని కొనియాడారు. నెల్లూరు జిల్లా ప్ర‌జ‌ల‌కు ఆయ‌న నిత్యం అందుబాటులో ఉండేవారని చెప్పారు.

    - 2019 ఎన్నిక‌ల్లో తిరుప‌తి లోక్‌స‌భ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన శ్రీ దుర్గాప్ర‌సాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌ట్ల వెనువెంట‌నే స్పందించేవార‌ని నివాళులు అర్పించారు.

    - ఆయన మృతి పార్టీకి తీర‌ని లోట‌ని, వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు.     

  • Amaravati updates: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష..
    16 Sep 2020 12:49 PM GMT

    Amaravati updates: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష..

    అమరావతి..

    -సాగునీటి ప్రాజెక్టులపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష

    -ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేయండి

    -వృథాగా పోతున్న వరద జలాలను ఒడిసి పట్టండి

    -చిత్రావతి, గండికోట ప్రాజెక్టుల్లో నీరు నింపాలి

    -సజావుగా భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలు

    -ఎక్కడా రైతులను ఇబ్బంది పెట్టేలా చర్యలు వద్దు

    -వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి

  • Amaravati updates: నైపుణ్యమే యువత భవితకు ఆయుధం: మేకపాటి గౌతమ్ రెడ్డి..
    16 Sep 2020 12:23 PM GMT

    Amaravati updates: నైపుణ్యమే యువత భవితకు ఆయుధం: మేకపాటి గౌతమ్ రెడ్డి..

    అమరావతి..

    పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

    • 30 నైపుణ్య కళాశాలల ఏర్పాటే ముఖ్యమంత్రి ధ్యేయం, మంత్రిగా నాకు సార్థకత

    • స్కిల్ కాలేజీల్లో భాగస్వామ్యమైన టెక్ మహీంద్ర ఫౌండేషన్, బయోకాన్ అకాడమీ, స్నైడర్ ఎలక్ట్రిక్

    • ఎపిఎస్‌ఎస్‌డిసితో టెక్ మహీంద్ర, బయోకాన్, స్నైడర్ కంపెనీల ఎంవోయూ

    • మంత్రి సమక్షంలో ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు సంస్థల ప్రతినిధుల సంతకాలు

    • నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులకు మంత్రి అభినందనలు

    • విశాఖలో టెక్ మహీంద్ర ఆధ్వర్యంలో లాజిస్టిక్ రంగంలో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'

    • నెల్లూరులో స్నైడర్ భాగస్వామ్యంతో ఎలక్ట్రికల్ విభాగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

    • స్కిల్ కాలేజీల్లో లైఫ్ సైన్సెస్ డొమైన్ లో నాలెడ్జ్ పార్టనర్ గా బయోకాన్ అకాడమి

  • 16 Sep 2020 11:30 AM GMT

    National updates: టిడిపి నాయకులు తప్పు చేశారు కాబట్టే దర్యాప్తుకు అడ్డుపడుతున్నారు..సురేష్ , వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీ..

    జాతీయం..

    సురేష్ , వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీ..

    -న్యాయం తప్పకుండా గెలుస్తుందని మా నమ్మకం

    -సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాటం చేస్తా ము

    -పెద్దవారికి ఒక రకంగా, చిన్న వారికి మరో రకంగా న్యాయం జరగడం అనేది సరైంది కాదు

    -సొంత నియోజకవర్గానికి వెళ్తే తంతారని భయంతో ఢిల్లీలో రఘురామకృష్ణ ఉంటున్నాడు

    -మిథున్ రెడ్డి పైన అవాకులు చెవాకులు పేళుతున్నాడు

    -రఘురామకృష్ణంరాజు చవట దద్దమ్మ లాగా మాట్లాడుతున్నాడు

    -ఆయన గజ్జి కుక్క కంటే హీనంగా మాట్లాడుతున్నాడు

    -త్వరలోనే రాజకీయాల నుంచి ఆయన కనుమరుగు కాక తప్పదు

    -రఘురామకృష్ణరాజు కు ప్రజలు సరైన గుణపాఠం చెప్తారు

    -మోసగాడు, చీటర్ కు ఓటు పెడితే నీకు 545 ఓట్లు పడతాయి

    -త్వరలోనే రాజు పై అనర్హత వేటు తప్పదు

    -చీప్ క్యారెక్టర్ కాబట్టి బీజేపీ వాళ్ళు నిన్ను బీజేపీలో చేర్చు కోవడం లేదు

  • 16 Sep 2020 11:23 AM GMT

    National updates: ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సభలో లిఖితపూర్వక సమాధానం..

    జాతీయం..

    -ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థలకు రూ 423 కోట్ల బకాయిలున్న కేంద్రం..

    -2018-19 కి రూ 183.25 కోట్లు,2019-20కి గాను రూ 239.95 కోట్లు కేంద్రం చెల్లించాల్సి ఉందన్న కేంద్రం

    -త్వరగా ఏపీకి బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సిఫార్సు చేసినట్లు తెలిపిన మంత్రి

    -ఏపీతో పాటు మిగతా అన్ని రాష్ట్రాలకు బకాయి నిధులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడి

    -బకాయిల చెల్లింపుపై మార్చి 21, ఏప్రిల్ 16న ఆర్ధిక శాఖకు లేఖ రాసినట్టు వెల్లడి

  • Srikakulam Corona Updates: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 495 కరోనా కేసులు నమోదు..
    16 Sep 2020 11:07 AM GMT

    Srikakulam Corona Updates: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 495 కరోనా కేసులు నమోదు..

    శ్రీకాకుళం జిల్లా..

    -దీంతో జిల్లాలో 34,215 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య..

    -ఈరోజు కరోనా నుంచి కోలుకుని 813 మంది డిశ్చార్..

    -ప్రస్తుతం జిల్లాలో 6,107 ఆక్టీవ్ కేసులు..

  • Visakha updates: ఏపీలోని విశాఖ జిల్లా వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాగా పరిగణిస్తున్నాం..
    16 Sep 2020 10:39 AM GMT

    Visakha updates: ఏపీలోని విశాఖ జిల్లా వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాగా పరిగణిస్తున్నాం..

    విశాఖ జిల్లా..

    -ఎంపీల ప్రశ్నలకు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ లిఖితపూర్వక సమాధానం:

    -భద్రతా పరమైన ఖర్చు (సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్‌పెండిచర్) స్కీమ్ పరిధిలో విశాఖ జిల్లా ఉంది

    -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పథకం కింద 2019-20లో రూ. 37.23 కోట్లు ఇచ్చాం

    -గత ఐదేళ్లలో 95.47 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చాం

    -నక్సలైట్ల లొంగుబాట్లను ప్రోత్సహించే పథకాలు అమలు చేస్తున్నాం

    -లొంగిపోయనవారు వ్యాపారాలు చేసుకునేందుకు శిక్షణ - ఆ సమయంలో నెలకు రూ. 6,000 స్టైపండ్ ఇస్తున్నాం

  • Guntur updates: అచ్చంపేట మండలం ఓర్వకల్లు సచివాలయ ఉద్యోగి శుభ నివాసరెడ్డి నిర్వాకం ...
    16 Sep 2020 10:34 AM GMT

    Guntur updates: అచ్చంపేట మండలం ఓర్వకల్లు సచివాలయ ఉద్యోగి శుభ నివాసరెడ్డి నిర్వాకం ...

    గుంటూరు....

    -మృతిచెందిన వ్యక్తులపేర్లుతో పించను మంజూరు చేసిన సోషల్‌వెల్ఫేర్‌ అసిస్టెంట్ అధికారి...

    -మృతుల పేర్లుతో పించను సొమ్మును ఉద్యోగి కాజేశాస్తునట్లు ఆధారాలతో పట్టుకున్న స్థానిక వైసిపి నాయకుల...

    -ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన స్థానిక నాయకులు... ఆధారాలతో జిల్లా అధికారులు తో నివేదిక ఇచ్చిన మండల అధికారులు.......

  • Tirumala-Tirupati updates: అయోధ్యలో శ్రీవారి ఆలయ నిర్మాణంకు సిద్దమవుతున్న టిటిడి..
    16 Sep 2020 9:58 AM GMT

    Tirumala-Tirupati updates: అయోధ్యలో శ్రీవారి ఆలయ నిర్మాణంకు సిద్దమవుతున్న టిటిడి..

    తిరుమల-తిరుపతి:

    -ఆలయ నిర్మాణంకు 5 ఏకరాల స్థలం కేటాయించాలని యూపి ప్రభుత్వాన్ని కోరిన టిటిడి

    -ఎసి గదులు ధరలు పెంచే యోచబలో టిటిడి త్వరలోనే అమలుకు సన్నాహాలు

    -వెయ్యి రూపాయల ఎసి గదులు ధరలను 1500 కి పెంచాలని నిర్ణయం

    -భక్తులు సౌకర్యార్ధం 120 ఎసి గదులును అడ్వాన్స్ రిజర్వేషన్ విధానం లో కేటాయించాలని నిర్ణయం

    -పాత ధరలకే టిటిడి డైరీ, క్యాలెండర్‌ లు విక్రయించాలని టిటిడి నిర్ణయం

    -నూతన ఏడాదికి 15 లక్షల శ్రీవారి క్యాలండర్లు,10 లక్షల డైరిలను విక్రయించనున్న టీటీడీ...

    -క్యాలండర్, డైరిల ధరలను పెంచాలని ప్రతిపాదించిన పర్చేస్ కమిటి....

  • Kadapa updates: పులివెందులలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరి అరెస్టు ...
    16 Sep 2020 8:42 AM GMT

    Kadapa updates: పులివెందులలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరి అరెస్టు ...

    కడప :

    -వారి వద్ద నుండి పది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు .....

    -పులివెందుల మండలం నామాలగుండు వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా ఒక ఆటోలో గంజాయి లభించింది ....

    -ఇద్దరు నిందితుల అరెస్టు ....ఒకరు పరారీ .....

Print Article
Next Story
More Stories