Live Updates: ఈరోజు (04 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (04 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 04 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | చవితి రా.1-45 తదుపరి పంచమి | మృగశిర నక్షత్రం రా.2-36 తదుపరి

ఆర్ద్ర | వర్జ్యం ఉ.6-54 నుంచి 8-37 వరకు | అమృత ఘడియలు సా.5-11 నుంచి 6-54 వరకు | దుర్ముహూర్తం ఉ.11-22 నుంచి 12-07 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26

తాజావార్తలు

Show Full Article

Live Updates

  • Amaravati Updates: అక్రమ ఆస్తులుపై అవినీతి నిరోధక శాఖ సోదాలు
    4 Nov 2020 1:44 PM GMT

    Amaravati Updates: అక్రమ ఆస్తులుపై అవినీతి నిరోధక శాఖ సోదాలు

     అమరావతి

    * అక్రమార్జన, అక్రమ ఆస్తులుపై డిప్యూటీ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, అధికారి కార్యాలయము, ఇండ్ల ఫై అవినీతి నిరోధక శాఖ సోదాలు

    * మోతికి వెంకట శివ సత్యనారాయణ వర ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, గుంటూరు లో పనిచేస్తారు

    * అక్రమ స్థిర, చరాస్తులపై గుంటూరు అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్

    * ఇల్లు, మూడు అనుబంధ ప్రదేశాలలో, గుంటూరు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కార్యాయంలో రైడ్స్

    * 3.34కోట్ల విలువైన్ మూడు ఇళ్ళు, 6లక్షల విలువైన ఒక ఫ్లాట్ గుర్తించిన అధికారులు

    * 15.64లక్షల విలువైన ఇంటి స్ధలాలు గుర్తించిన ఏసీబీ

    * 2.47 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తింపు

    * 18లక్షల విలువైన బంగారం, 50లక్షలకు పైగా ఫిక్సుడ్ డిపాజిట్లు కలిగి ఉన్నట్టు గుర్తించిన అధికారులు

    * లెక్కలలో చూపని 3.7 కోట్ల విలువైన ఆస్థులు కలిగి ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ

    * ఏకకాలంలో గుంటూరు, విజయవాడ లలో ఏసీబీ దాడులు

  • Ananthapur Updates: యువతి కిడ్నాప్ ఛేదించిన పోలీసులు...
    4 Nov 2020 1:39 PM GMT

    Ananthapur Updates: యువతి కిడ్నాప్ ఛేదించిన పోలీసులు...

    అనంతపురం:

    * యువతి కిడ్నాప్ జరిగిన 30 గంటల్లోనే  ఛేదించిన పోలీసులు

    * యువతి క్షేమం ఐదుగురు కిడ్నాపర్లను అరెస్టు.

    * మూడు కార్లు స్వాధీనం

    * కిడ్నాప్ ఘటనకు సూత్రధారి కర్నూలు జిల్లా అవుకు కానిస్టేబుల్ , ఆయన కుటుంబ సభ్యులు

    * యువతికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేసుకోవాలనే కిడ్నాప్ ...

    * పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో కిడ్నాప్ ఘటన సుఖాంతం

    * మహిళలపై నేరాలకు పాల్పడితే ఎవర్నీ ఉపేక్షించం: ఎస్పీ సత్య ఏసుబాబు.

  • Tirumala Updates: చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభణ...
    4 Nov 2020 1:03 PM GMT

    Tirumala Updates: చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభణ...

      తిరుపతి

    * స్కూళ్లు తెరవడంతో టీచర్లు, స్టూడెంట్స్ కు వ్యాపిస్తున్న కరోనా

    * గడిచిన 2 రోజుల్లోనే 150 మంది టీచర్లకు కరోనా పాజిటివ్

    * కోవిడ్ పరీక్షల కోసం క్యూ కడుతున్న టీచర్లు

    * ఈనెల 8లోపు పరీక్షలు చేయించుకోవాలని జిల్లా విద్యాశాఖ ఆదేశం

  • Amaravati Updates: గిరిజన సంక్షేమ శాఖ పై మంత్రి పుష్పశ్రీ వాణి సమీక్ష..
    4 Nov 2020 11:34 AM GMT

    Amaravati Updates: గిరిజన సంక్షేమ శాఖ పై మంత్రి పుష్పశ్రీ వాణి సమీక్ష..

      అమరావతి..

    -ట్రైబల్ సబ్ ప్లాన్ పటిష్టంగా అమలు చేయండి.

    -నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోండి.

    -టీఎస్పీ నిధులన్నీ గిరిజనులకే చెందేలా చూడండి.

    -ఆదివాసీ ఆరోగ్యం, ఫీడర్ ఆంబులెన్స్ లను కొనసాగించండి.

    -శాఖపై సమీక్షలు చేయండి.. పర్యవేక్షణ పెంచండి

    -అధికారులకు పుష్ప శ్రీవాణి దిశానిర్దేశం

  • Amaravati Updates: ఝార్కండ్ లోని బ్రహ్మదిహా బొగ్గు గనిని సొంతం చేసుకున్న ఏపీఎండీసీ..
    4 Nov 2020 11:27 AM GMT

    Amaravati Updates: ఝార్కండ్ లోని బ్రహ్మదిహా బొగ్గు గనిని సొంతం చేసుకున్న ఏపీఎండీసీ..

    అమరావతి..

    -259 ఎకరాల పరిధిలోని బ్రహ్మదిహా బ్లాక్ లోని కోకింగ్ కోల్ బొగ్గును మైనింగ్ చేయనున్న ఏపీఎండీసీ

    -కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంస్ టీసీ నిర్వహించిన బిడ్డింగ్ లో కోకింగ్ కోల్ బ్లాక్ ను దక్కించుకున్న ఏపీఎండీసీ

    -ఏడాదికి 0.15 మిలియన్ టన్నుల బొగ్గును తవ్వితీసుకునేందుకు అవకాశం

  • East Godavaari Updates: అగ్రహారం హైస్కూలు లో జిల్లా వైద్యశాఖ అధికారుల తనిఖీలు..
    4 Nov 2020 11:14 AM GMT

    East Godavaari Updates: అగ్రహారం హైస్కూలు లో జిల్లా వైద్యశాఖ అధికారుల తనిఖీలు..

    తూర్పుగోదావరి :

    పి.గన్నవరం

    -అంబాజీపేట మం. గంగలకుర్రు అగ్రహారం హైస్కూలు లో జిల్లా వైద్యశాఖ అధికారుల తనిఖీలు..

    -నిన్న మిడ్ డే మీల్ వర్కర్ కు కరోనా నిర్ధారణ కావడంతో విద్యార్ధులకు ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహించనున్న అధికారులు..

  • Srikakulam Updates: రాజాం GMR IT కాలేజీలో సెమిస్టర్ పరీక్ష వాయిదా..
    4 Nov 2020 11:12 AM GMT

    Srikakulam Updates: రాజాం GMR IT కాలేజీలో సెమిస్టర్ పరీక్ష వాయిదా..

    శ్రీకాకుళం జిల్లా..

    -రాజాం GMR IT కాలేజీలో సెమిస్టర్ పరీక్ష వాయిదా..

    -పరీక్షకు హాజరైన విద్యార్థికి కరొణ పాజిటివ్ నిర్ధారణ కావడంతో వాయిదా పడిన సెమిస్టర్ పరీక్ష..

  • Amaravati Updates: నాడు నేడు పనుల ప్రగతిపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమీక్ష..
    4 Nov 2020 11:02 AM GMT

    Amaravati Updates: నాడు నేడు పనుల ప్రగతిపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమీక్ష..

    అమరావతి..

    -సచివాలయం లోని మంత్రి ఛాంబర్ లో అధికారులతో జరుగుతున్న సమీక్ష.

    -పనుల్లో జాప్యం సహించేది లేదని మంత్రి హెచ్చరిక.

    -సామగ్రి సరఫరా చేయని కంపెనీల అగ్రిమెంట్ లు పరిశీలించి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు.

  • Nellore Updates: పిచ్చిరెడ్డి కల్యాణ మండపంలో  బిసిల అభినందన సభ..
    4 Nov 2020 10:54 AM GMT

    Nellore Updates: పిచ్చిరెడ్డి కల్యాణ మండపంలో బిసిల అభినందన సభ..

    నెల్లూరు :

     మంత్రి బాలినేని కామెంట్స్..

    -ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాలలో 90 శాతం అమలులో ఉన్నాయి..

    -బిసిలలో ఇన్ని కులాలు ఉన్నాయని వెలికి తీసి వాళ్ళని రాజ్యాధికారం వైపు తీసుకెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ ది

    -బీసీలను వాడుకొని ,ఆతర్వాత అనగదొక్కిన చరిత్ర చంద్రబాబు ది

    -ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలుకు టీడీపీ వాళ్ళు కూడా ఆకర్షితులవు తున్నారు....

    -ఇంకో 20 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి గా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు....

  • Nellore Updates: పిచ్చిరెడ్డి కల్యాణ మండపంలో బిసిల అభినందన సభ..
    4 Nov 2020 10:49 AM GMT

    Nellore Updates: పిచ్చిరెడ్డి కల్యాణ మండపంలో బిసిల అభినందన సభ..

    నెల్లూరు :

    మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్

    -దేశంలో బిసిలకు పదవులు,అందులో 50 శాతం మహిళలకు ఇవ్వడం ఒక వండర్

    -నేను ఎన్ని జన్మలెత్తినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోలేను.

    -ఏపీ కి జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి గా వుంటారు...ప్రజలు ఆయన్ని ఆరాధిస్తున్నారు..

    -బిసి,ఎస్సి,ఎస్టీ ,మైనారిటీ లు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకుంటున్నారు..

    -బిసి లు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు...బాక్ బోన్ క్లాస్ అని జగన్మోహన్ రెడ్డి నిరూపించారు..

    -అచ్చంనాయుడు జైలు కి పోవడానికి కారణం చంద్రబాబే

    -ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల నేడు 2 కోట్ల మంది బిసిలకు లబ్ధిపొందుతున్నారు..

    -కరోనా నేపధ్యంలో తొమ్మిది నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకోసం చంద్రబాబు ఒక్కరోజు కూడా ఏపీ కి రాలేదు...

    -ఆయన కొడుకు ఏపీ కి టూరిస్ట్ లా వచ్చి పోతున్నాడు

    -పెద్ద పప్పు మహరాజ్ లోకేష్ ....ఆంధ్ర పప్పు అని గూగుల్ లో కొడితే నీపేరే వస్తుంది...మమ్మల్ని ఏమిచేయమంటావ్

    -బాబు అధికారంలో వుంటే బిసిలు బిజినెస్ క్లాస్. అవుతారు..ప్రతిపక్షనలో ఉంటె బిసిలు బ్యాక్ వార్డ్ అయిపోతారు

Print Article
Next Story
More Stories