Live Updates: ఈరోజు (సెప్టెంబర్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 03 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, కృష్ణపక్షం-పాడ్యమి (ఉ.10-41వరకు) తదుపరి విదియ, పూర్వాభాద్ర నక్షత్రం (రా.8-20 వరకు) తదుపరి ఉత్తరాభాద్ర అమృత ఘడియలు (ఉ.11-41 నుంచి 1-25 వరకు) వర్జ్యం: లేదు దుర్ముహూర్తం (ఉ.9-56 నుంచి 10-45 వరకు తిరిగి మ. 2-53 నుంచి 3-42 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-11

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Guntur district updates: కొల్లిపర మండలం..వల్లబాపురం గ్రామంలో వైసిపి, టీడీపి మధ్య ఘర్షణ.....
    3 Sep 2020 4:45 AM GMT

    Guntur district updates: కొల్లిపర మండలం..వల్లబాపురం గ్రామంలో వైసిపి, టీడీపి మధ్య ఘర్షణ.....

    గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం,

    -వల్లబాపురం గ్రామంలో వైసిపి, టీడీపి మధ్య ఘర్షణ.....

    -ఒక్కరిపై ఒక్కరు కర్రలతో దాడులు పలువురికి గాయాలు.

    -తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఇరువర్గాలు....

    -పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యని ఇరువర్గాలు....

  • Amaravati updates: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వం లో ఉదయం 11 గంటలకు సచివాలయం లో మొదటి బ్లాక్ లో సమావేశం కానున్న కేబినెట్..
    3 Sep 2020 4:39 AM GMT

    Amaravati updates: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వం లో ఉదయం 11 గంటలకు సచివాలయం లో మొదటి బ్లాక్ లో సమావేశం కానున్న కేబినెట్..

    అమరావతి..

    -ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వం లో ఉదయం 11 గంటలకు సచివాలయం లో మొదటి బ్లాక్ లో సమావేశం కానున్న కేబినెట్.

    -మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపం ప్రకటించనున్న కేబినెట్.

    -నేటి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

    -కృష్ణా డెల్టా ఆయకట్టును పరిరక్షించేందుకు ప్రకాశం బ్యారేజీ కింద మరో రెండు బ్యారేజీలు నిర్మించడం సాధ్యాసాద్యల పై కాబినెట్ లో చర్చించే అవకాశం.

    -రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం.

    -రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా వ్యయానికి ఇకపై నగదును రైతుల ఖాతాల్లోనే జమ చేసేందుకు మంత్రివర్గలో చర్చ

    -రెవెన్యూ వ్యవహారాల పర్యవేక్షణకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో కొత్తగా డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి (డీడీవో) లు. దీనిపైనే కేబినెట్ లో చర్చ

    -ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒకరు చొప్పున 51 డీడీవో పోస్టులుకు ఆమోదం తెలిపే అవకాశం.

    -రాష్ట్రం లో కోవిడ్ కేస్ లు విజృంభిస్తుండడం మంత్రులకు కోవిడ్ ఇప్పటికే సోకడం తో దానిపైన చర్చ వచ్చే అవకాశం.

    -రాష్ట్రం లో తీసుకుంటున్న కోవిడ్ నియంత్రణ చర్యలు పైన చర్చించే అవకాశం.

    -జి ఎస్ టి పరిహారం పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పైన కాబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం.

    -గోదావరి, కృష్ణ వరద ముంపు ప్రాంతాలలో బాధితులకు అందిన పరిహారం పై చర్చించే అవకాశం.

    -వాటిల్లిన నష్టం పై అంచనాలు సిద్ధం చేయడంతో పాటు దానిపై కేంద్రసాయం విషయం లో కేబినెట్ లో చర్చించే అవకాశం.

  • Amalapuram  updates: అమలాపురం ఎక్సైజ్ పోలీసులు అత్యుత్సాహం..
    3 Sep 2020 3:42 AM GMT

    Amalapuram updates: అమలాపురం ఎక్సైజ్ పోలీసులు అత్యుత్సాహం..

    తూర్పు గోదావరి జిల్లా..

    అమలాపురం..

    -అమలాపురం ఎక్సైజ్ పోలీసులు అత్యుత్సాహం

    -అంబాజీపేటలో మద్యం కేసులో కోలా వెంకటరత్నం అనే వృద్దుడుతో పాటు తొమ్మిదేళ్ల మనవడిని నిర్బంధించిన ఎక్సైజ్ పోలీసులు

    -అంబాజీపేటలో దివ్యాంగుడైన వెంకటరత్నం ఇంటిలో సోదాలు చేసి 20 మద్యం సీసాలు ,ఒక వాహనం స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు

    -వెంకటరత్నం నుంచి ఇరవై వేలు నగదు, నాలుగు ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారని బంధువులు ఆరోపణ

    -వెంకటరత్నం తో 9 ఏళ్ల బాలుడ్ని ఎక్సైజ్ సిబ్బంది నిర్బంధించడం పై గ్రామస్తులు ,బంధువులు ఆగ్రహం

    -వృద్దుడు తోపాటు బాలుడు తోడుగా స్టేషన్ కు వచ్చాడని చెబుతున్న ఎక్సైజ్ అధికారులు

    -బాలుడికి కరోనా లక్షణాలున్నాయని ఆస్పత్రికి తరలిస్తామంటున్న అధికారులు..

  • 3 Sep 2020 3:37 AM GMT

    East Godavari district: జిల్లా లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా 52 మంది వైద్యులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం..

    తూర్పుగోదావరి..

    -జిల్లా లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా 52 మంది వైద్యులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

    -నిన్ననే విధుల్లో చేరిన 16 మంది డాక్టర్లు

  • Rajahmundry updates: రాజమండ్రి వద్ద పెరుగుతున్న వరద గోదావరి..
    3 Sep 2020 3:32 AM GMT

    Rajahmundry updates: రాజమండ్రి వద్ద పెరుగుతున్న వరద గోదావరి..

    తూర్పుగోదావరి -రాజమండ్రి..

    -రాజమండ్రి వద్ద పెరుగుతున్న వరద గోదావరి

    -ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ 175 గేట్ల నుంచి 8లక్షల ఐదు వేల క్యూసెక్కుల సముద్రంలోకి విడుదల

    -ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 10.30 అడుగులకు చేరిన వరదనీటిమట్టం

    -గోదావరిలో భద్రాచలం వద్ద క్రమేణా పెరగనున్న వరద ఉధృతి ..

    -42.30 అడుగులకు చేరిననీటిమట్టం

    -పోలవరం కాఫర్ డ్యాం ప్రభావంతో మూడోసారి జలదిగ్భంధంలో చిక్కుకున్న దేవీపట్నం ...

    -36 గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

    -బోట్లపై సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్న వరద బాధితులు

    -ధవలేశ్వరం దిగువన కోనసీమలో వరదతో పొంగుతున్న వశిష్ట, వైనతేయ ,గౌతమీ నదులు

    -తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య చాకలిపాలెం, కరకాయలంకల వద్ద మునిగిపోయిన కాజ్వేలు..

    -భయం గుప్పిట్లో కోనసీమ లంకగ్రామాల ప్రజలు..

  • Guntur District updates: తెనాలి శివాజీ చౌక్ లో దుండగుల దుశ్చర్యం....
    3 Sep 2020 3:22 AM GMT

    Guntur District updates: తెనాలి శివాజీ చౌక్ లో దుండగుల దుశ్చర్యం....

    గుంటూరు...

    -తెనాలి శివాజీ చౌక్ లో దుండగుల దుశ్చర్యం....

    -భగత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు...

    -చత్రపతి శివాజీ చౌరస్తా వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహం తల భాగం వరకు ధ్వంసం...

    -శివాజీ చౌక్ వద్ద ఆందోళనకు దిగిన బిజెపి ఇతర ప్రజాసంఘాల నాయకులు...

    -రోడ్డుపై బైఠాయించి నిరసన.....

    -స్వతంత్ర కోసం పోరాడిన మహనాభావులకు అవమానకరం...

    -దుశ్చర్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్..

    -దేశ స్వతంత్రం కోసం తన ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించిన గొప్ప నేత భగత్ సింగ్...

    -అటువంటి నేత విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం బాధాకరమని

    -ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్...

    -వెంటనే విగ్రహాన్ని నెలకొల్పే అంతవరకు తాము ఇక్కడ నుంచి కదిలేది లేదంటున్న బిజెపి నేతలు...

    -బిజెపి నేత పాటిబండ్ల కృష్ణ...

  • Visakhapatnam updated: సింహాంద్రి అప్పన్న హుండీ ఆదాయం 35 రోజులకు గాను 47 లక్షల నగదు
    3 Sep 2020 2:45 AM GMT

    Visakhapatnam updated: సింహాంద్రి అప్పన్న హుండీ ఆదాయం 35 రోజులకు గాను 47 లక్షల నగదు

    విశాఖ..

    -సింహాంద్రి అప్పన్న హుండీ ఆదాయం 35 రోజులకు గాను 47 లక్షల నగదు, 22 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి అప్పన్నకు భక్తులు కానుకగా సమర్పించారు.

    -భక్తుల రాక పెరగడంతో స్వామి వారి ఆదాయం క్రమేపీ పెరుగుతోంది.

    -స్వామి వారి పూజలు ఆన్​లైన్​లో పెరుగుతుండటంతో.. ఆదాయం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Anantapur updates: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం హుండీ ఆదాయం రూ 26.16 లక్షలు.
    3 Sep 2020 2:36 AM GMT

    Anantapur updates: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం హుండీ ఆదాయం రూ 26.16 లక్షలు.

    అనంతపురం:

    -శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం హుండీ ఆదాయం రూ 26.16 లక్షలు.

    -కరోనా తో మార్చి నుంచి ఆలయం మూసివేత. ఇటీవలే దర్శనాలకు అనుమతి.

    -160 రోజుల తరువాత హుండీ లెక్కింపు.

  • Srisailam Project updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..
    3 Sep 2020 2:33 AM GMT

    Srisailam Project updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

    కర్నూలు జిల్లా.....

    -శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

    -ప్రస్తుతనీటి మట్టం:885 అడుగులు

    -పూర్తి స్థాయి నీటి మట్టం:885 అడుగులు

    -ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు

    -పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు

    -ఇన్ ఫ్లో:37,297 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో:40,869క్యూసెక్కులు

    -కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

  • Anantapur updates: జేఎన్టీయూ పరిధిలో ఇంజనీరింగ్ తుది సంవత్సరం విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు..
    3 Sep 2020 2:26 AM GMT

    Anantapur updates: జేఎన్టీయూ పరిధిలో ఇంజనీరింగ్ తుది సంవత్సరం విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు..

    అనంతపురం:

    -అనంతపురం జేఎన్టీయూ పరిధిలో ఇంజనీరింగ్ తుది సంవత్సరం విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు

    -ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుంపు.

    -మొత్తం పరీక్షలు రాయనున్న వారు 20,100 మంది.

Print Article
Next Story
More Stories