Live Updates: ఈరోజు (సెప్టెంబర్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 03 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, కృష్ణపక్షం-పాడ్యమి (ఉ.10-41వరకు) తదుపరి విదియ, పూర్వాభాద్ర నక్షత్రం (రా.8-20 వరకు) తదుపరి ఉత్తరాభాద్ర అమృత ఘడియలు (ఉ.11-41 నుంచి 1-25 వరకు) వర్జ్యం: లేదు దుర్ముహూర్తం (ఉ.9-56 నుంచి 10-45 వరకు తిరిగి మ. 2-53 నుంచి 3-42 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-11
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 3 Sept 2020 10:15 AM IST
Guntur district updates: కొల్లిపర మండలం..వల్లబాపురం గ్రామంలో వైసిపి, టీడీపి మధ్య ఘర్షణ.....
గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం,
-వల్లబాపురం గ్రామంలో వైసిపి, టీడీపి మధ్య ఘర్షణ.....
-ఒక్కరిపై ఒక్కరు కర్రలతో దాడులు పలువురికి గాయాలు.
-తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఇరువర్గాలు....
-పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యని ఇరువర్గాలు....
- 3 Sept 2020 10:09 AM IST
Amaravati updates: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వం లో ఉదయం 11 గంటలకు సచివాలయం లో మొదటి బ్లాక్ లో సమావేశం కానున్న కేబినెట్..
అమరావతి..
-ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వం లో ఉదయం 11 గంటలకు సచివాలయం లో మొదటి బ్లాక్ లో సమావేశం కానున్న కేబినెట్.
-మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపం ప్రకటించనున్న కేబినెట్.
-నేటి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
-కృష్ణా డెల్టా ఆయకట్టును పరిరక్షించేందుకు ప్రకాశం బ్యారేజీ కింద మరో రెండు బ్యారేజీలు నిర్మించడం సాధ్యాసాద్యల పై కాబినెట్ లో చర్చించే అవకాశం.
-రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం.
-రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా వ్యయానికి ఇకపై నగదును రైతుల ఖాతాల్లోనే జమ చేసేందుకు మంత్రివర్గలో చర్చ
-రెవెన్యూ వ్యవహారాల పర్యవేక్షణకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కొత్తగా డివిజనల్ డెవలప్మెంట్ అధికారి (డీడీవో) లు. దీనిపైనే కేబినెట్ లో చర్చ
-ప్రతి రెవెన్యూ డివిజన్కు ఒకరు చొప్పున 51 డీడీవో పోస్టులుకు ఆమోదం తెలిపే అవకాశం.
-రాష్ట్రం లో కోవిడ్ కేస్ లు విజృంభిస్తుండడం మంత్రులకు కోవిడ్ ఇప్పటికే సోకడం తో దానిపైన చర్చ వచ్చే అవకాశం.
-రాష్ట్రం లో తీసుకుంటున్న కోవిడ్ నియంత్రణ చర్యలు పైన చర్చించే అవకాశం.
-జి ఎస్ టి పరిహారం పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పైన కాబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం.
-గోదావరి, కృష్ణ వరద ముంపు ప్రాంతాలలో బాధితులకు అందిన పరిహారం పై చర్చించే అవకాశం.
-వాటిల్లిన నష్టం పై అంచనాలు సిద్ధం చేయడంతో పాటు దానిపై కేంద్రసాయం విషయం లో కేబినెట్ లో చర్చించే అవకాశం.
- 3 Sept 2020 9:12 AM IST
Amalapuram updates: అమలాపురం ఎక్సైజ్ పోలీసులు అత్యుత్సాహం..
తూర్పు గోదావరి జిల్లా..
అమలాపురం..
-అమలాపురం ఎక్సైజ్ పోలీసులు అత్యుత్సాహం
-అంబాజీపేటలో మద్యం కేసులో కోలా వెంకటరత్నం అనే వృద్దుడుతో పాటు తొమ్మిదేళ్ల మనవడిని నిర్బంధించిన ఎక్సైజ్ పోలీసులు
-అంబాజీపేటలో దివ్యాంగుడైన వెంకటరత్నం ఇంటిలో సోదాలు చేసి 20 మద్యం సీసాలు ,ఒక వాహనం స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు
-వెంకటరత్నం నుంచి ఇరవై వేలు నగదు, నాలుగు ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారని బంధువులు ఆరోపణ
-వెంకటరత్నం తో 9 ఏళ్ల బాలుడ్ని ఎక్సైజ్ సిబ్బంది నిర్బంధించడం పై గ్రామస్తులు ,బంధువులు ఆగ్రహం
-వృద్దుడు తోపాటు బాలుడు తోడుగా స్టేషన్ కు వచ్చాడని చెబుతున్న ఎక్సైజ్ అధికారులు
-బాలుడికి కరోనా లక్షణాలున్నాయని ఆస్పత్రికి తరలిస్తామంటున్న అధికారులు..
- 3 Sept 2020 9:07 AM IST
East Godavari district: జిల్లా లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా 52 మంది వైద్యులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం..
తూర్పుగోదావరి..
-జిల్లా లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా 52 మంది వైద్యులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
-నిన్ననే విధుల్లో చేరిన 16 మంది డాక్టర్లు
- 3 Sept 2020 9:02 AM IST
Rajahmundry updates: రాజమండ్రి వద్ద పెరుగుతున్న వరద గోదావరి..
తూర్పుగోదావరి -రాజమండ్రి..
-రాజమండ్రి వద్ద పెరుగుతున్న వరద గోదావరి
-ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ 175 గేట్ల నుంచి 8లక్షల ఐదు వేల క్యూసెక్కుల సముద్రంలోకి విడుదల
-ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 10.30 అడుగులకు చేరిన వరదనీటిమట్టం
-గోదావరిలో భద్రాచలం వద్ద క్రమేణా పెరగనున్న వరద ఉధృతి ..
-42.30 అడుగులకు చేరిననీటిమట్టం
-పోలవరం కాఫర్ డ్యాం ప్రభావంతో మూడోసారి జలదిగ్భంధంలో చిక్కుకున్న దేవీపట్నం ...
-36 గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
-బోట్లపై సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్న వరద బాధితులు
-ధవలేశ్వరం దిగువన కోనసీమలో వరదతో పొంగుతున్న వశిష్ట, వైనతేయ ,గౌతమీ నదులు
-తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య చాకలిపాలెం, కరకాయలంకల వద్ద మునిగిపోయిన కాజ్వేలు..
-భయం గుప్పిట్లో కోనసీమ లంకగ్రామాల ప్రజలు..
- 3 Sept 2020 8:52 AM IST
Guntur District updates: తెనాలి శివాజీ చౌక్ లో దుండగుల దుశ్చర్యం....
గుంటూరు...
-తెనాలి శివాజీ చౌక్ లో దుండగుల దుశ్చర్యం....
-భగత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు...
-చత్రపతి శివాజీ చౌరస్తా వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహం తల భాగం వరకు ధ్వంసం...
-శివాజీ చౌక్ వద్ద ఆందోళనకు దిగిన బిజెపి ఇతర ప్రజాసంఘాల నాయకులు...
-రోడ్డుపై బైఠాయించి నిరసన.....
-స్వతంత్ర కోసం పోరాడిన మహనాభావులకు అవమానకరం...
-దుశ్చర్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్..
-దేశ స్వతంత్రం కోసం తన ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించిన గొప్ప నేత భగత్ సింగ్...
-అటువంటి నేత విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం బాధాకరమని
-ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్...
-వెంటనే విగ్రహాన్ని నెలకొల్పే అంతవరకు తాము ఇక్కడ నుంచి కదిలేది లేదంటున్న బిజెపి నేతలు...
-బిజెపి నేత పాటిబండ్ల కృష్ణ...
- 3 Sept 2020 8:15 AM IST
Visakhapatnam updated: సింహాంద్రి అప్పన్న హుండీ ఆదాయం 35 రోజులకు గాను 47 లక్షల నగదు
విశాఖ..
-సింహాంద్రి అప్పన్న హుండీ ఆదాయం 35 రోజులకు గాను 47 లక్షల నగదు, 22 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి అప్పన్నకు భక్తులు కానుకగా సమర్పించారు.
-భక్తుల రాక పెరగడంతో స్వామి వారి ఆదాయం క్రమేపీ పెరుగుతోంది.
-స్వామి వారి పూజలు ఆన్లైన్లో పెరుగుతుండటంతో.. ఆదాయం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
- 3 Sept 2020 8:06 AM IST
Anantapur updates: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం హుండీ ఆదాయం రూ 26.16 లక్షలు.
అనంతపురం:
-శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం హుండీ ఆదాయం రూ 26.16 లక్షలు.
-కరోనా తో మార్చి నుంచి ఆలయం మూసివేత. ఇటీవలే దర్శనాలకు అనుమతి.
-160 రోజుల తరువాత హుండీ లెక్కింపు.
- 3 Sept 2020 8:03 AM IST
Srisailam Project updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..
కర్నూలు జిల్లా.....
-శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..
-ప్రస్తుతనీటి మట్టం:885 అడుగులు
-పూర్తి స్థాయి నీటి మట్టం:885 అడుగులు
-ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు
-పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు
-ఇన్ ఫ్లో:37,297 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో:40,869క్యూసెక్కులు
-కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
- 3 Sept 2020 7:56 AM IST
Anantapur updates: జేఎన్టీయూ పరిధిలో ఇంజనీరింగ్ తుది సంవత్సరం విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు..
అనంతపురం:
-అనంతపురం జేఎన్టీయూ పరిధిలో ఇంజనీరింగ్ తుది సంవత్సరం విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు
-ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుంపు.
-మొత్తం పరీక్షలు రాయనున్న వారు 20,100 మంది.












