Live Updates: ఈరోజు (సెప్టెంబర్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 03 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, కృష్ణపక్షం-పాడ్యమి (ఉ.10-41వరకు) తదుపరి విదియ, పూర్వాభాద్ర నక్షత్రం (రా.8-20 వరకు) తదుపరి ఉత్తరాభాద్ర అమృత ఘడియలు (ఉ.11-41 నుంచి 1-25 వరకు) వర్జ్యం: లేదు దుర్ముహూర్తం (ఉ.9-56 నుంచి 10-45 వరకు తిరిగి మ. 2-53 నుంచి 3-42 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-11
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 3 Sept 2020 7:52 AM IST
Anantapur updates: తుంగభద్ర హెచ్ ఎం సీ కాలువకు నీటి కేటాయింపులు..
అనంతపురం:
-తుంగభద్ర హెచ్ ఎం సీ కాలువకు నీటి కేటాయింపులు
-సాగునీటి సలహా మండలి సమావేశం లేకుండానే నీటి కేటాయింపులపై నిర్ణయం.
-కరోనా నేపథ్యంలో సమావేశం వాయిదా
-లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నిర్ణయం
-తాగునీటికి ప్రాధాన్యత
-హెచ్ఎల్సీ వాటాగా దామాషా ప్రకారం 24.988 టీఎంసీలు వస్తాయని అంచనా
-10 టీఎంసీలు తాగునీటికి కేటాయింపు
-14.988 టీఎంసీలు సాగు కు ఇవ్వాలని నిర్ణయం
-హెచ్ ఎల్ ఎం సి కి 3.376 టీఎంసీలు.
-జి బి సి కాల్వకు 3.17 7 టీఎంసీలు
-మిడ్ పెన్నార్ జలాశయం దక్షిణ కాల్వకు 1.992, ఉత్తర కాలువకు 0.862 టీఎంసీలు.
-తాడిపత్రి ఉప కాల్వకు 1.706 టిఎంసిలు కేటాయింపు.
- 3 Sept 2020 7:48 AM IST
Amaravati updates: ఈరోజు ఏపీ మంత్రివర్గ సమావేశం..
అమరావతి:
-ఈరోజు ఏపీ మంత్రివర్గ సమావేశం
-సచివాలయం లోని మొదటి బ్లాక్ లో భేటీ
-సీఎం వైఎస్ జగన్ అధ్యక్షత న సచివాలయంలో ఉదయం11గంటలకు క్యాబినెట్ సమావేశం
-పలు కీలక అంశాలపై చర్చించ నున్న కేబినెట్
-వైఎస్సార్ ఆసరా పథకం అమలు పై చర్చ
-కొత్తగా బిసి కార్పొరేషన్ ల ఏర్పాట్లకు ఆమోదం
-ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం అమలు పై క్యాబినెట్ లో చర్చ.
-కృష్ణా, గోదావరి వరదల్లో పంట నష్టం ,పరిహారం పై చర్చ.
-వైఎస్సార్ సంపూర్ణ పోషణ.
-పథకం..
-పలు ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, మున్సిపాలిటీ సంస్కరణల అమలు వంటి అంశాల పై చర్చించ నున్న మంత్రివర్గ సమావేశం





