Live Updates:ఈరోజు (ఆగస్ట్-02) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 02 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం చతుర్దశి (రాత్రి 9-30 వరకు) తదుపరి పూర్ణిమ; పూర్వాషాఢ నక్షత్రం (ఉ. 7-27 వరకు) తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం, అమృత ఘడియలు (రాత్రి 11-16 నుంచి 2-53 వరకు), వర్జ్యం (మ. 3-32 నుంచి 5-10 వరకు) దుర్ముహూర్తం ( సా. 4-47 నుంచి 5-38 వరకు) రాహుకాలం (సా. 4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-30

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 2 Aug 2020 2:14 AM GMT

    కర్నూలు జిల్లలో విషాదం: మూడు గంటల వ్యవధిలో తల్లీ కొడుకుల దుర్మరణం

    కర్నూలు.

    - కోవెలకుంట్ల మండలం జోలదరాసి గ్రామంలో విషాదం...ఒకే రోజు తల్లి, కుమారుడు మృతి...

    - వైసిపి సీనియర్ నేత రామేశ్వర్ రెడ్డి (55) కరోనా తో మృతి.

    - కుమారుడు కరోనా సోకి మృతి చెందడంతో తల్లడిల్లి పోయి,తనువు చాలించిన తల్లి .

    - 3 గంటల వ్యవధిలోనే తల్లి కుమారుడి మృతి....

  • 2 Aug 2020 2:12 AM GMT

    తూర్పుగోదావరి జిల్లా కరోనా అప్డేట్స్

    తూర్పుగోదావరి

    - జిల్లాలో రికార్డు స్థాయిలో కోలుకున్న కరోనా పాజిటీవ్ పేషెంట్స్

    - జిల్లాలో మార్చి 21 తొలి కరోనా కేసు తాకినప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకూ 21వేల 171 పాజిటీవ్ కేసు నమోదు

    - గత రెండ్రోజులలో రికార్డు స్థాయిలో డిశ్చార్జిలతో 13,317కి చేరుకున్న కోలుకున్న వారి సంఖ్య

    - జిల్లాలో ప్రస్తుతం 7,864 యాక్టీవ్ కేసులు

    - జిల్లాలో ఇంత వరకూ 172కు చేరిన కరోనా మారణాలు

  • 2 Aug 2020 2:11 AM GMT

    గుంటూరు జిల్లా కరోనా అప్డేట్స్

    గుంటూరు...

    - జిల్లాలో విజృపిస్తున్న కరోనా

    - జిల్లా వ్యాప్తంగా1001పాజిటివ్ కేసులు నమోదు....

    - గుంటూరు కార్పోరేషన్ అత్యధిక ంగా 333పాజిటివ్ కేసులు నమోదు...

    - పిడుగురాళ్ల లో 94కేసులు....

  • 2 Aug 2020 2:08 AM GMT

    విశాఖ జిల్లా కరోనా అప్డేట్స్

    విశాఖ

    - విశాఖ లో కొనసాగుతున్న వైరస్ వర్రీ..

    - అనూహ్యంగా నిన్న ఒక్కరోజు 11 వందల కు పైబడి కరోనా పోజటీవ్ కేసులు.

    - ఇప్పటికే 12 వేలు దాటిన కేసులు...

  • 2 Aug 2020 2:07 AM GMT

    శ్రీకాకుళం జిల్లా కరోనా అప్డేట్స్

    శ్రీకాకుళం జిల్లా..

    - జిల్లాలో 7,133 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య..

    - ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 3895 మంది బాధితులు డిశ్చార్జ్..74 మంది మృతి..

    - ప్రస్తుతం జిల్లాలో 3164 ఆక్టీవ్ కేసులు..

  • 2 Aug 2020 2:02 AM GMT

    తుంగభద్ర హెచ్ఎల్సీ నీరు ఆంధ్రాకు

    అనంతపురం:

    తుంగభద్ర హెచ్ఎల్సీ నీరు ఆంధ్రాకు చేరిక.

    500 క్యూసెక్కుల నీరు సరిహద్దు నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రవాహం.

  • 2 Aug 2020 1:35 AM GMT

    వాతావరణం: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీదన ద్రోణి

    వెదర్ అప్ డేట్

    - ఈ నెల 4 వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం.

    - ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణీ..

    - వీటీ ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర లో వర్షాలు

  • 2 Aug 2020 1:34 AM GMT

    బెరైటీస్‌ గనుల తవ్వకాల పనులు తాత్కాలికంగా నిలిపివేత

    కడప :

    - ఓబులవారిపల్లె మండలంలోని మంగంపేట బెరైటీస్‌ గనుల తవ్వకాల పనులు తాత్కాలికంగా నిలిపివేత...

    - ఏపీఎండీసీ మంగంపేట శాఖలో పనిచేసే కార్మికుల్లో 10 మందికి సోకిన కరోనా ...

    - బెరైటీస్‌ గనుల్లో డీవాటరింగ్‌ పనులు మినహాయించి అన్ని విభాగాల పనులు తాత్కాలికంగా నిలిపివేతకు యాజమాన్యం అదేశాలు...

  • 2 Aug 2020 1:31 AM GMT

    గంజాయి పట్టివేత

    తూర్పుగోదావరి

    - రాజవొమ్మంగి మం. జడ్డంగిలో రూ.3లక్షల విలువైన 150 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు

    - గంజాయి తరలిస్తున్న జీపు స్వాధీనం

    - తమిళనాడుకు చెందిన ఇరువుర్ని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చిన పోలీసులు

  • 2 Aug 2020 1:30 AM GMT

    తూర్పుగోదావరిలో మరో మూడు కోవిడ్ కేంద్రాలు

    తూర్పుగోదావరి

    - కరోనా కరాళనృత్యం నేపధ్యంలో జిల్లాలో అదనంగా మరో ఆరు కొవిడ్‌ కేంద్రాలు

    - అమలాపురం, రామచంద్రపురం, తుని ఏరియా ఆసుపత్రులను, మండపేట, పిఠాపురం, రాజోలు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లను కొవిడ్‌ కేంద్రాలుగా మారుస్తాఁ

    - హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న కరోనా బాధితులను అత్యవసరమైతే ఆయా కొవిడ్ కేంద్రాలకు తరలిస్తాం

    -జిల్లా కొవిడ్‌ నోడల్‌ అధికారి సోమసుందరరావు

Print Article
Next Story
More Stories