ఈరోజు (మే-20-బుధవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
తాజా వార్తల్ని తెలుసుకునే ముందు ..ఈరోజు హైదరాబాద్ లో వాతావరణం కాస్త మేఘావృతమై ఉండి కనిష్టంగా 26 డిగ్రీలు , గరిష్టంగా 36 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉంది. గాలిలో తేమ 37 శాతం ఉంటుంది. ఇక విజయవాడలో కనిష్టంగా 28 డిగ్రీలు, గరిష్టంగా 44 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ గాలిలో తేమ 46 శాతం ఉంటుంది.
తాజా వార్తలు
Live Updates
- 20 May 2020 9:10 AM IST
విశాఖకు చేరిన వందే భారత్ 2 విమానాలు
* భారత ప్రభుత్వ వందే భారత్-2 లో భాగంగా అబుదాబి నుంచి విశాఖ విమానాశ్రయానికి విమానం చేరింది.
* రాత్రి అబుదాబి నుంచి 148 మంది ప్రయాణికులు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.
* ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు 13 జిల్లాలకు చెందిన ప్రవాసాంధ్రులు, విద్యార్థులు ఉన్నారు.
* ప్రయాణీకులకు ఎయిర్ పోర్ట్ లో కోవిడ్ పరీక్షలు, ఇమిగ్రేషన్, ఇతర పరీక్షలు, తరవాత ఎయిర్ పోర్ట్ వెలుపలికి పంపనున్నట్లు ఎయిర్ పోర్ట్ అథారిటీ తెలిపింది.
* వారి సొంత జిల్లాలకు దింపడానికి సిద్ధంగా ఉంచిన 13 బస్లు, ఎస్కార్ట్ సిబ్బంది ప్రభుత్వ అధికారులు సిద్ధం చేశారు.
* మనిలా నుంచి విశాఖ చేరుకోనున్న మరో విమానం.
* మనీలా (ఫిలిప్పీన్స్) నుండి విశాఖపట్నం ఎయిరిండియా ప్రత్యేక విమానంలో చేరుకున్న 166 మంది తెలుగువారు.
* వచ్చిన వారిలో ఎనిమిది మంది విశాఖ వారు మిగతా 158 మంది ఏపీలో ఇతర జిల్లా వారు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

- 20 May 2020 7:48 AM IST
రెండో అతిపెద్ద 'సూపర్ సైక్లోన్'గా అంపన్
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అంపన్ తుపాను తీవ్రత కొనసాగుతుంది. దీని ప్రభవంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా తయారైంది. పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చింది. కాగా.. అంపన్ తుపాను ఉత్తరాంధ్రలో కాస్త ప్రభావం చూపింది.
- 20 May 2020 7:10 AM IST
విశాఖ డాక్టర్ ను హైకోర్టులో హాజరు పరచానున్న పోలీసులు
- నేడు విశాఖ డాక్టర్ సుధాకర్ ను హైకోర్టులో హాజరపరచనున్న విశాఖ పోలీసులు
- సుధాకర్ పట్ల పోలీసులు, ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తించిందని హైకోర్టుకి ఫిర్యాదు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత
- అనిత ఫిర్యాదు సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
- సుధాకర్ ను నేడు కోర్టులో హాజరు పరచాలన్న హైకోర్టు
- 20 May 2020 7:07 AM IST
ఏపీ సరిహద్దుల వద్ద అక్రమ మద్యం పట్టివేత
కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి లో భారీగా మద్యం పట్టివేత..
- తెలంగాణ నుండి అక్రమంగా ఆంధ్రా లోకి తరలిస్తూ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ 300 మద్యం బాటిళ్లతో పట్టుబడిన వైనం.
- మాటు వేసి మద్యం అక్రమ రవాణా ను అడ్డుకున్న ముగ్గురు స్టేషన్ సిబ్బందికి రివార్డులను అందజేసిన-ఏఎస్పీ..
- నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు, ఇన్ఛార్జ్ సిఐ పి.శ్రీను,విస్సన్నపేట ఎస్సై లక్ష్మణ్ లను అభినందించిన-ఏఎస్పీ వకుల్ జిందాల్..



