ఈరోజు (మే-19-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
నిన్నటి ముఖ్యాంశాలు:
* కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ భోగస్ : కేసీఆర్.....పూర్తి వివరాలు
* నియంత్రిత విధానంలో వ్యవసాయం చేస్తే రైతులకు లాభాలు : సీఎం కేసీఆర్ .....పూర్తి వివరాలు
* లాక్ డౌన్ 4.0 ఏపీలో ఇలా...పూర్తి వివరాలు
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 19 May 2020 7:11 AM IST
తెలంగాణా జిల్లాల్లో రోడ్డెక్కిన బస్సులు
- తెలంగాణలో 56 రోజుల తరువాత ఆర్టీసీ బస్సులు రోడ్దేక్కాయి
-జిల్లాల లో మాత్రమె బస్సులు ప్రారంభం అయ్యాయి.
- హైదరాబాద్ లో బస్సులు తిరిగే అవకాశం లేదని నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే
- అయితే, హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్ లకు అనుమతి ఇచ్చారు. కానీ, టాక్సీలో డ్రైవర్ తొ కలిపి నలుగుర, ఆటోలో డ్రైవర్ తొ కలిపి ముగ్గురు మాత్రమె ప్రయాణించే అవకాశం ఉంది.
- సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వరకూ మాత్రమె బస్సులు వస్తాయి. ఎంజీబీఎస్ కు బస్సులు రావు.
- అందరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి



