Pakistan: ఇక్కడే చదువుకున్న.. ఇక్కడే ఓటు వేశా.. ఇండియా నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన ఓసామా వైరల్‌ కామెంట్స్‌!

Pakistan
x

Pakistan: ఇక్కడే చదువుకున్న.. ఇక్కడే ఓటు వేశా.. ఇండియా నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన ఓసామా వైరల్‌ కామెంట్స్‌!

Highlights

Pakistan: ఒసామా చెప్పిన ప్రకారం, అతనికి ఆధార్‌, రేషన్‌కార్డు, ఇతర భారతీయ గుర్తింపు పత్రాలున్నాయి. అయితే ఇవి పౌరసత్వానికి ప్రమాణంగా పరిగణించవు. పుట్టిన సర్టిఫికెట్‌, డొమిసైల్‌ సర్టిఫికేట్లు మాత్రమే పౌరసత్వానికి ప్రామాణికమైన ఆధారాలు.

Pakistan: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న దూకుడు నిర్ణయాల నేపథ్యంలో, దాదాపు 900 మంది పాక్ పౌరులను దేశం నుంచి వెనక్కు పంపింది. వీరిలో కొంతమంది గత నాలుగు నుంచి ఐదు దశాబ్దాలుగా భారత్‌లో జీవిస్తున్నారు. ఈ మధ్యే వెనక్కు పంపినవారిలో ఓ వ్యక్తి, ఇస్లామాబాద్‌-రావల్పిండి ప్రాంతానికి చెందిన ఒసామా కూడా ఉన్నాడు. అతను ఏకంగా 17 ఏళ్లుగా భారత్‌లో జీవించడమే కాకుండా, ఓటు కూడా వేసినట్టు చెప్పడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.

అటారీ-వాఘా భూసరిహద్దుపై చివరి రోజు వెనక్కు పంపిన 110 మందిలో ఒసామా ఒకడు. అతను పదో తరగతి, ఇంటర్మీడియట్‌ను భారత్‌లోనే పూర్తిచేసి, ప్రస్తుతం కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ చదువుతున్నట్టు తెలిపాడు. జూన్‌లో పరీక్షలు ఉండగా, ఆలోచనలన్నీ ఒక్కసారిగా తారుమారయ్యాయని, ఏం చేయాలో తెలియడం లేదని చెప్పాడు. పోలీసులు ఒక్కసారిగా స్టేషన్‌కు రమ్మని పిలిచి, వెళ్లిన తర్వాతే తాను వెనక్కు పంపబడతానని అర్థమైందని వెల్లడించాడు.

ఇదిలా ఉంటే, అతను ఓటింగ్ చేశానంటూ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. జమ్ముకశ్మీర్‌ చీఫ్ ఎలక్టోరల్ అధికారిని విచారణకు ఆదేశించింది. ఓ విదేశీ వ్యక్తి భారత ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించుకోవడం, ఓటేయడం ఎలాంటి అధికారిక నిర్లక్ష్యానికి సూచనగా ఉందో స్పష్టమవుతోంది. బారాముల్లాలోని ఉరి అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో అతని పేరు ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒసామా చెప్పిన ప్రకారం, అతనికి ఆధార్‌, రేషన్‌కార్డు, ఇతర భారతీయ గుర్తింపు పత్రాలున్నాయి. అయితే ఇవి పౌరసత్వానికి ప్రమాణంగా పరిగణించబడవు. పుట్టిన సర్టిఫికెట్‌, డొమిసైల్‌ సర్టిఫికేట్లు మాత్రమే పౌరసత్వానికి ప్రామాణికమైన ఆధారాలు.

ఇంతకాలం భారత్‌లో నివసించిన పాక్‌ పౌరుల్లో కొంతమంది 20–30 ఏళ్లుగా ఇక్కడే స్థిరపడ్డారని ఒసామా చెప్పాడు. వారికి కొన్ని నిర్ణీత గడువులు ఇవ్వాలని, సవరణలతో సహా మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వాన్ని కోరాడు. పహల్గాం ఘటనపై తీవ్రంగా ఖండిస్తూ, ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశాడు. ఈ నేపథ్యంలో పాక్ పౌరులు ఎలా భారత్‌లో ఓటర్లు అయ్యారు? ఎవరు వారికి గుర్తింపు పత్రాలు మంజూరు చేశారు? అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. పహల్గాం దాడికి ప్రతిగా తీసుకున్న చర్యలతో పాటు, భారత్‌లో పౌరసత్వాన్ని సంబంధించి అనేక విస్తృతమైన లోపాలూ వెలుగులోకి వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories