Russia: రష్యాలో ఘోర ప్రమాదం..పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు..ఏడుగురు మృతి, 30 మంది తీవ్రగాయాలు..!!

Fatal accident in Russia Passenger train derails Seven dead, 30 seriously injured telugu news
x

Russia: రష్యాలో ఘోర ప్రమాదం..పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు..ఏడుగురు మృతి, 30 మంది తీవ్రగాయాలు..!!

Highlights

Russia: రష్యాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పశ్చిమ రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో శనివారం రాత్రి వంతెన కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ...

Russia: రష్యాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పశ్చిమ రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో శనివారం రాత్రి వంతెన కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 7గురు మరణించారు. దాదాపు 30 మంది గాయపడ్డారు. రైలు ప్రమాదానికి "అక్రమ జోక్యం" కారణమని రష్యన్ అధికారులు ఆరోపించారు. ఉక్రెయిన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న పశ్చిమ రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో ఈ రైలు ప్రమాదం జరిగింది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడుల తర్వాత ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. మాస్కో రైల్వే ప్రకారం, రవాణా కార్యకలాపాలలో అక్రమ జోక్యం కారణంగా వంతెన కూలిపోయింది. వంతెన కూలిపోవడం వల్ల రైలు పట్టాలు తప్పింది.

రైలు నడుస్తున్న రైల్వే లైన్ మీదుగా వంతెన వెళ్ళిందని రోసావ్టోడర్ ధృవీకరించింది. వంతెన అకస్మాత్తుగా కూలిపోవడంతో, ఎదురుగా వస్తున్న రైలు మార్గంలో ఉన్న భారీ కాంక్రీటు ముక్కలు పట్టాలపై పడ్డాయి. దీంతో రైలు పట్టాలు తప్పింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లోని ఫోటోలు, వీడియోలు రైలు కోచ్‌లు శిథిలాలతో చెల్లాచెదురుగా పడి ఉండటం గమనించవచ్చు. వంతెన కూలిపోయిన భయానక క్షణాన్ని కొన్ని సోషల్ మీడియా వీడియోలు వైరల్ అవుతున్నాయి.

బ్రయాన్స్క్ గవర్నర్ అలెగ్జాండర్ బొగోమాజ్ మృతులను ధృవీకరించారు. గాయపడిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. బాధితులకు అవసరమైన అన్ని సహాయం అందించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని బొగోమాజ్ అన్నారు. అత్యవసర సేవలు, స్థానిక అధికారులు సంఘటనా స్థలంలో పనిచేస్తున్నారని కూడా ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories