వ్యాపారం దగ్గర దోస్తానా జాన్తానై.. పాకిస్తాన్ కు చైనా దిమ్మతిరిగే షాక్!

వ్యాపారం దగ్గర దోస్తానా జాన్తానై.. పాకిస్తాన్ కు చైనా దిమ్మతిరిగే షాక్!
x
Imran Khan (File Photo)
Highlights

కరోనా మహమ్మారిని ప్రపంచం మీదకు వదిలిన చైనా దోస్తులకు మరోరకం షాకిస్తోంది. తన వ్యాపారం విషయంలో దోస్తానా చల్తా కుచ్ భీ చల్తా నై.. అని నిరూపిస్తోంది.

కరోనా మహమ్మారిని ప్రపంచం మీదకు వదిలిన చైనా దోస్తులకు మరోరకం షాకిస్తోంది. తన వ్యాపారం విషయంలో దోస్తానా చల్తా కుచ్ భీ చల్తా నై.. అని నిరూపిస్తోంది. ఆపద సమయంలోనూ దోచేసుకున్తోంది. పాకిస్తాన్, చైనా ఎంత మంచి దోస్తులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకరికోసం ఒకరు అన్నట్టుగా ఉంటాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా రోజురోజుకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.. పాకిస్తాన్ కూడా కరోనా వ్యాపించింది. ఇప్పటికే పాక్ లో కరోనా కేసులు సంఖ్య 2800కి పైగా నమోదు అయ్యాయి. ఈ నేపధ్యంలో కరోనా విషయంలో అండగా ఉంటామని హామి ఇచ్చిందట చైనా... హామీ ఇచ్చనట్టు గానే సహాయం చేసిందట. కానీ చైనా చేసిన ఆ సహాయానికి పాక్ ఖంగు తిందట! ఇంతకి ఎం జరిగింది అంటే!

పాకిస్తాన్ మీడియా వెల్లడించిన కథనం ప్రకారం.. కరోనా వైరస్ విషయంలో సహాయం చేస్తానన్న చైనా అన్నట్టుగానే పాకిస్దాన్‌కు 2లక్షల సాధారణ మాస్కులు, 2వేల ఎన్‌ 95 మాస్కులు, 5 వెంటిలేటర్లు, 2వేల కరోనా టెస్టింగ్ కిట్లు, డాక్టర్లు వేసుకోవడానికి 2వేల మెడికల్ సూట్లు పంపించింది. అయితే పాకిస్దాన్ బలగాలు సింధ్ ప్రావిన్స్‌లో వాటిని సరిగా పరీక్షించకుండానే ఆస్పత్రులకు సరఫరా చేశాయి.ఇంతకి చైనా పంపించిన బాక్స్ లలో ఏముందో చూశాక పాక్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించదట! ఇంతకి అందులో ఎం ఉందంటే..

పంపిన బాక్సుల్లో, "లో" దుస్తులతో చేసిన మాస్కులు కనిపించాయట.. దీనితో అక్కడి ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా ఖంగు తిందట! దీనితో దేశవ్యాప్తంగా ఈ ఘటన పాక్‌లో కలకలం రేపిందని పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపైన ఇరు దేశాల ప్రతినిధులు ఎలా స్పందిస్తారో అన్నది చూడాలి మరి.. ! పాక్‌లో ఈ వార్త కలకలం రేపడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories