US Companies: భారత్‌కు సాయం చేసేందుకు 40 యూఎస్‌ కంపెనీల కన్సార్టియం

American Companies: కరోనాతో పోరాడుతున్న భారత్‌కు అమెరికా నలుమూలల నుంచీ భారీ సాయం వస్తోంది.

Arun Chilukuri
Updated on: 8 May 2021 12:26 PM IST
CEOs of 40 US Companies Create Global Task Force to help India Fight COVID-19
X

కరోనా (ఫైల్ ఇమేజ్ )

US Companies: కరోనాతో పోరాడుతున్న భారత్‌కు అమెరికా నలుమూలల నుంచీ భారీ సాయం వస్తోంది. యూఎస్‌లోని 40కి పైగా ప్రముఖ కార్పొరేట్ సంస్థలన్నీ ఒక టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి భారత్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. దీనికోసం ఈ గ్లోబల్ టాస్క్‌ఫోర్స్ ఓ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.

అమెరికాలోని కార్పొరేట్ సంస్థలు భారత్‌కు అందించే సహాయాన్ని ఈ స్టీరింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. కమిటీలో ముగ్గురు భారతీయ అమెరికన్ సీఈఓలు సభ్యులుగా చేరారు. గుగూల్ సీఈఓ సుందర్ పిచాయ్, డెలాయిట్ సీఈఓ పునిత్ రెంజెన్, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ ఈ కమిటీలో చేరారు. ఇప్పటికే ఈ కమిటీలో బిల్-మిలిందా గేట్స్ ఫౌండేషన్ సీఈఓ మార్క్ సుజ్మన్ తదితర ప్రముఖులు ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story