Red Sea: ఎర్రసముద్రంలో తీరని విషాదం.. ఆరుగురిని మింగేసిన సబ్‌మెరిన్!

Red Sea: ఈజిప్టు రెడ్ సీ తీరంలో సబ్‌మెరిన్ మునిగిన ఘటనలో ఆరుగురు రష్యా పర్యాటకులు మృతిచెందారు.

Mowgli
Updated on: 28 March 2025 6:00 AM IST
Red Sea
X

Red Sea: ఎర్రసముద్రంలో తీరని విషాదం.. ఆరుగురిని మింగేసిన సబ్‌మెరిన్!

Red Sea: ఈజిప్టులోని రెడ్ సీ తీరంలో రష్యాకు చెందిన 45 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ సబ్‌మెరిన్ మునిగిపోయిన ఘటనలో కనీసం ఆరుగురు మరణించారు. హర్గాదా వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. మొత్తం 29 మందిని అధికారులు రక్షించి ఆసుపత్రికి తరలించారు, వారు ప్రస్తుతం వారి ఆరోగ్య స్థిరంగా ఉన్నట్టు చెబుతున్నారు. మిగతా ప్రయాణికుల కోసం గాలింపు కొనసాగుతోంది. సిన్‌డ్‌బ్యాడ్ అనే సబ్‌మెరిన్ కోరల్ రీఫ్ టూర్ కోసం గురువారం ఉదయం 10 గంటల సమయంలో బయలుదేరింది. సముద్రతీరానికి సగం మైలు దూరంలో ఇది మునిగిపోయింది. సబ్‌మెరిన్‌ మునిగిన కారణాలు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. ఈ వాహనం హర్గాదాలో ఉన్న సిండ్బ్యాడ్ సబ్‌మెరిన్స్ అనే సంస్థకు చెందింది. దీన్ని 44 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లతో రూపొందించారని సంస్థ వెబ్‌సైట్ పేర్కొంది.

రష్యా కాన్సులేట్, ఇప్పటివరకు నలుగురు మరణించినట్లు తెలిపినా, వారి జాతీయతపై స్పష్టత ఇవ్వలేదు. మరికొందరి స్థితిగతులపై ఇంకా సమాచారం అందాల్సి ఉంది. ఘటనా స్థలానికి అత్యంత సమీపంగా ఉన్న ప్రాంతంగా హర్గాదా పర్యాటకుల మధ్య ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ ప్రమాదం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది.

ఇదే ప్రాంతంలో నాలుగు నెలల క్రితం కూడా ఓ టూరిస్ట్ యాట్ మునిగిన ఘటన జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ ప్రమాదంలో నలుగురు మరణించగా, 33 మందిని రక్షించారు. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాల నేపథ్యంలో రెడ్ సీ ప్రాంతంలో పర్యటనలు తగ్గించినట్లు, కొన్నిచోట్ల పూర్తిగా నిలిపివేసినట్లు పర్యాటక సంస్థలు వెల్లడిస్తున్నాయి. ప్రాంతీయ స్థాయిలో నెలకొన్న ఉద్రిక్తతలు కూడా దీనికి కారణంగా పేర్కొంటున్నారు.

Mowgli

Mowgli

Next Story