లారీలు అడ్డుపెట్టి అత్యాచారం.. ప్రియాంక రెడ్డి హత్య కేసులో సంచలనాలు?

లారీలు అడ్డుపెట్టి అత్యాచారం.. ప్రియాంక రెడ్డి హత్య కేసులో సంచలనాలు?
x
Highlights

ప్రియాంకరెడ్డిని దుండగులు తప్పుదోవ పట్టించారా? పక్కా ప్రణాళికతోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రియాంకను ఒంటరిగా ఉండటం...

ప్రియాంకరెడ్డిని దుండగులు తప్పుదోవ పట్టించారా? పక్కా ప్రణాళికతోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రియాంకను ఒంటరిగా ఉండటం చూసిన దుండగులు.. అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు. ఆ తర్వాత డెడ్‌బాడీని పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు.

అందరూ అనుమానించినట్టే అత్యంత దారుణం జరిగింది. షాద్‌నగర్ సమీపంలో శవమై తేలిన యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డిని హత్యకు ముందు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసినట్లు సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. చీకటి పడటం, ప్రియాంక రెడ్డి ఒంటరిగా ఉండటం, నిర్మానుష్య ప్రదేశం కావడంతో మానవ మృగాలు కిరాతకంగా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టి, ఆధారాలు లేకుండా హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తున్న ప్రియాంక రెడ్డి బుధవారం సాయంత్రం 6.19 నిమిషాలకు పింపుల్స్‌కు సంబంధించిన చికిత్స కోసం ఇంటి నుంచి గచ్చిబౌలిలో ఓ క్లినిక్‌ బయలుదేరింది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రోజూ తన స్కూటీని పార్క్ చేసే ప్రదేశంలో వాహనాన్ని పార్క్ చేసి క్యాబ్‌లో గచ్చిబౌలి చేరుకుంది. చికిత్స అనంతరం బాగా చీకటి పడిన తర్వాత రాత్రి 9.30 గంటల సమయంలో తిరిగి శంషాబాద్ చేరుకుంది.

శంషాబాద్ చేరుకున్న కాసేపటికే తన చెల్లెలికి ఫోన్ చేసిన ప్రియాంక రెడ్డి భయాందోళన వ్యక్తం చేసింది. తన స్కూటీ టైర్ పంక్చర్ అయిందని చెప్పి.. ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారని, అక్కడ ఉన్న లారీ డ్రైవర్లను చూస్తే భయమేస్తోందని భయం భయంగా చెప్పింది. 'భయపడకు, టోల్ ప్లాజా వద్దకు వెళ్లు..' అని ప్రియాంక రెడ్డి సోదరి ఆమెకు ధైర్యం చెప్పింది. మళ్లీ ఫోన్ చేస్తా అని చెప్పి కట్ చేసింది. ఇంతలోనే దారుణం జరిగినట్లు తెలుస్తోంది.

రాత్రి పూట ఒంటరిగా ఉన్న ప్రియాంక రెడ్డికి దుండగులు మాయమాటలు చెప్పి తప్పు దారి పట్టించారు. పక్కా ప్రణాళికతో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ప్రియాంకను అపహరించి, అప్పటికే రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీల వెనుకాల నిర్మానుష్య ప్రదేశంలోకి లాక్కెళ్లి తమ పశువాంఛ తీర్చుకున్నట్లు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే అర్థమవుతోంది. ఘటనా స్థలంలో ప్రియాంక రెడ్డి లోదుస్తులు , ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో తీవ్ర పెనుగులాట జరిగినట్లు ఆనవాళ్లున్నాయి.

ప్రియాంకరెడ్డిని ప్రాణాలతో వదిలిపెడితే తమ నేరం బయటపడుతుందనే దుండగులు హత్య చేశారా? కిడ్నాప్‌కు గురైన ప్రియాంకను శంషాబాద్ టోల్ ప్లాజా సమీపంలో దారుణంగా హత్య చేసిన దుండగులు డెడ్‌బాడీని 27 కిలోమీటర్ల దూరంలోకి తీసుకెళ్లి ఎందుకు దహనం చేశారు.? సోదరి మాట విని ఉంటే ప్రియాంక ప్రాణాలు దక్కేవా..? ఇవే ఇప్పుడు తలెత్తుతున్న సందేహాలు అయితే, ప్రియాంక హత్య ఆమె కుటుంబంతో తీరని విషాదాన్ని నింపింది.

ప్రియాంక రెడ్డిపై బలత్కారం చేసిన దుండగులు ఆమెను వదిలిపెడితే తమ నేరం బయటపడుతుందని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రియాంక కిడ్నాప్‌కు గురైన శంషాబాద్ టోల్ ప్లాజా సమీపంలోనే ఆమెను దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని 27 కి.మీ. దూరంలో షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వంతెన కింద పెట్రోలు పోసి దహనం చేసినట్లు తెలుస్తోంది.

దారుణంగా హత్యకు గురవడానికి ముందు ప్రియాంక రెడ్డి తన స్కూటీపై శంషాబాద్ టోల్ ప్లాజాను క్రాస్ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. బైక్ టైర్ పంక్చర్ అయిందని, టైర్‌లో గాలి చాలా తక్కువగా ఉందని అలాగే ముందుకెళితే ప్రమాదమని చెప్పి దుండగులు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిందితులే బైక్ టైర్‌లో గాలి తీసేసి ప్రియాంక రెడ్డిని తప్పుదారి పట్టించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రియాంక రెడ్డి ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడం, ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. శంషాబాద్ ప్రాంతానికి వెళ్లి గాలించారు. ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో గురువారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో శంషాబాద్ పోలీసులను ఆశ్రయించారు. జరిగిన ఘోరం ఊహించుకొని కన్నీరుమున్నీరవుతున్నారు. తాను చెప్పిన మాట విని టోల్ ప్లాజా వద్దకు వెళ్లిపోతే తన సోదరి ప్రాణాలతో దక్కేదని ప్రియాంక సోదరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గురువారం ఉదయం షాద్‌నగర్‌లో చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద ఓ యువతి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లిన ప్రియాంక తండ్రి శ్రీధర్ రెడ్డి.. దుస్తులు, మెడలోని నెక్లెస్ ఆధారంగా ఆ మృతదేహం తమ కూతురుదేనని గుర్తించారు. ప్రియాంక రెడ్డి స్వస్థలం కొల్లాపూర్ సమీపంలోని నర్సయిపల్లి గ్రామం. ఆమె తండ్రి శ్రీధర్ రెడ్డి కూడా వైద్యులే. వీరి కుటుంబం శంషాబాద్‌లో నివాసం ఉంటోంది. ప్రియాంక నవీపేట్ మండలం కొల్లూర్‌లో వేటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తోంది. ప్రియాంక హత్య ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories