నన్ను తీసుకెళ్లిన వారిలో రాజు నాకు తెలుసు.. కిడ్నాప్ చేర నుంచి బయటపడ్డ బాలుడు

నన్ను తీసుకెళ్లిన వారిలో రాజు నాకు తెలుసు.. కిడ్నాప్ చేర నుంచి బయటపడ్డ బాలుడు
x
Highlights

''నాకు రోజూ ఇడ్లీ లే పెట్టారు. నన్ను ఎవరూ కొట్టలేదు. నన్ను తీసుకువెళ్ళిన వారిలో రాజు నాకు తెలుసు. తనే నన్ను కారులో తీసుకువచ్చి వదిలి వెళ్లాడు.'' అంటూ...

''నాకు రోజూ ఇడ్లీ లే పెట్టారు. నన్ను ఎవరూ కొట్టలేదు. నన్ను తీసుకువెళ్ళిన వారిలో రాజు నాకు తెలుసు. తనే నన్ను కారులో తీసుకువచ్చి వదిలి వెళ్లాడు.'' అంటూ చెబుతున్నాడు నాలుగు రోజుల క్రితం కిడ్నాపై ఈరోజు దొరికిన బాలుడు జషిత్. నాలుగు రోజుల క్రితం తన ఇంటి వద్దనుంచి నాలుగేళ్ల బాలుడు జషిత్ కిడ్నాపైన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా పోలీసులు బాలుని ఆచూకీ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుతుకలూరులో ఈ తెల్లవారుజామున స్థానికులకు జషిత్ దొరికాడు. ఈ సందర్భంగా వచ్చీరాని మాటలతో కిడ్నాపర్ల గురించి తనకు తెల్సిన విషయాలను చెబుతున్నాడు.

ఇప్పుడు పోలీసులు రాజు అనే వ్యక్తి ఎవరనే కోణంలో విచారాణ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. జషిత్ క్షేమంగా తిరిగి రావడంతో కేసును మరింత వేగంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలో జషిత్ చెబుతున్న వివరాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. తనను తీసుకువెళ్ళిన వారు వేరే ఊరు తీసుకువెళ్లి అక్కడ ఓ వ్యక్తి ఇంట్లో తనని వదిలేశారని జషిత్ చెప్పడంతో ఆ కోణం లో కూడా విచారణను వేగవంతం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుని తీరుతామని పోలీసులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories