విమానంలో తిరుపతి తీసుకెళ్లలేదని..

విమానంలో తిరుపతి తీసుకెళ్లలేదని..
x
Highlights

విమానంలో తిరుపతికి తీసుకెళ్లలేదని భర్తతో గొడవ పడిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుంటూరుకు చెందిన ఎన్‌.ప్రవళ్లిక(30) మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది.

విమానంలో తిరుపతికి తీసుకెళ్లలేదని భర్తతో గొడవ పడిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుంటూరుకు చెందిన ఎన్‌.ప్రవళ్లిక(30) మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమె 2014లో ఎస్పీఆర్‌హిల్స్‌ రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన వెంకటరమణను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ రాజీవ్‌గాంధీనగర్‌లో ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె రిత్విక. ఈ నెల 10న రిత్విక పుట్టు వెంట్రుకలు తీసేందుకు వెంకటరమణ కుటుంబంతో సహా తిరుపతి వెళ్లేందుకు రైలు టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రయాణం వాయిదా పడింది.

తాజాగా తిరుపతికి వెళ్లేందుకు వెంకటరమణ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అందరం కలిసి విమానంలో వెళ్దామని ప్రవళ్లిక కోరగా భర్త వద్దన్నాడు. విమానంలో వెళితే ఖర్చు భారీగా ఉంటుందని, వారం రోజుల్లో రైలులోనే వెళ్దామని చెప్పాడు. దీంతో తన కంటే తల్లిదండ్రుల మాటకే ఎక్కువ విలువ ఇస్తున్నాడని మనస్తాపం చెందింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ప్రవళ్లిక బుధవారం విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. భర్తతో మాట్లాడకుండా గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బహుశా తనపై అలిగి పడుకుందని వెంకటరమణ భావించాడు. ఉదయం తలుపు కొట్టినా తీయకపోవడంతో అనుమానంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి ఆమెను కిందికి దించారు. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories