అనుమానంతో భార్యను చంపేశాడు...

అనుమానంతో భార్యను చంపేశాడు...
x
Highlights

ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పాల్సిన ఓ పోలిస్ అధికారి భార్యపై అనుమానం పెంచుకొని ఆమెను విచక్షణా రహితంగా నరికి చంపేసాడు. ఈ ఘటన హైదరాబాద్‌ లో చోటు...

ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పాల్సిన ఓ పోలిస్ అధికారి భార్యపై అనుమానం పెంచుకొని ఆమెను విచక్షణా రహితంగా నరికి చంపేసాడు. ఈ ఘటన హైదరాబాద్‌ లో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... కర్నూలుకు చెందిన అబ్దుల్‌ రషీద్‌‌కు 2013లో నౌషిద్ బేగం(23) అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం.. హైదరబాదు లోని అంబర్‌పేట‌లోని ఆజాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. అబ్దుల్‌ రషీద్‌‌ హైదరాబాద్‌లో ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

అయితే కొంతకాలం బాగానే ఉన్నా, తరుచుగా ఇరువురు మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. అనుమానంతో ఎప్పుడు భార్యపై గొడవకు దిగేవాడు అబ్దుల్‌ రషీద్‌.. వీరికి ఇంటి ఓనర్ అయిన సలీం నచ్చజేప్పేవాడు. కానీ శుక్రవారం మధ్యాహ్నం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నౌషిద్ ని అబ్దుల్‌ రషీద్‌‌ తలపై గొడ్డలితో నరికి దారుణంగా చంపేశాడు. ఇంటినుండి కేకలు రావడంతో ఇంటి ఓనర్ వెళ్లి చూడగా ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. సలీం పోలీసులకు వివరాలు అందజేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories