అత్తింటి వేధింపులకు వివాహిత బలి

అత్తింటి వేధింపులకు వివాహిత బలి
x
Highlights

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆర్బీనగర్‌లో అక్షిత అనే వివాహిత ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. రెండేళ్ల క్రితం...

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆర్బీనగర్‌లో అక్షిత అనే వివాహిత ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. రెండేళ్ల క్రితం రాఘవేందర్‌ రెడ్డి అనే వ్యక్తితో అక్షిత వివాహం జరిగింది. మొదట వీరి సంసారం సాఫీగా సాగినా అనంతరం మనస్పర్దలు ఎక్కువయ్యాయి. దీంతో అక్షిత ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. అయితే అక్షిత మృతికి అత్తింటి వారే కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కట్నం భారీగా ఇచ్చి ఘనంగా వివాహం చేశామని బోరున విలపించారు. అక్షిత మృతదేహంతో ఆమె బంధువులు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగి బైఠాయించారు. భర్త, అత్తామామలను వెంటనే అరెస్టు చేయాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories