ప్రియుడు కోసం దారుణం.. ప్రియుడి మోజులో కన్న తల్లిని కడతేర్చిన ఓ కూతురు

ప్రియుడు కోసం దారుణం.. ప్రియుడి మోజులో కన్న తల్లిని కడతేర్చిన ఓ కూతురు
x
Highlights

నవమాసాలు మోసి 20 ఏళ్ల పాటు పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని ఓ కూతురు దారుణంగా హతమార్చింది. మానవత్వం కూడా సిగ్గుపడే ఈ ఘటన రాజధాని హైదరాబాద్‌లో జరిగింది....

నవమాసాలు మోసి 20 ఏళ్ల పాటు పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని ఓ కూతురు దారుణంగా హతమార్చింది. మానవత్వం కూడా సిగ్గుపడే ఈ ఘటన రాజధాని హైదరాబాద్‌లో జరిగింది. ప్రేమ వ్యవహారంలో తనను మందలించిందని ప్రియుడితో కలిసి తల్లిని కిరాతకంగా హతమార్చింది. రామన్నపేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాస్‌రెడ్డి కొన్నేళ్ల క్రితం హైదారబాద్‌లో స్థిరపడ్డాడు.

తండ్రి లారీ డ్రైవర్‌గా డ్యూటీకి వెళ్లగా తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ప్రియుడితో కలిసి మూడు రోజుల పాటు ఇంట్లోనే గడిపింది. దుర్వాసన రావడంతో అదే ప్రియుడి సహయంతో స్వగ్రామం రామన్నపేట సమీపంలో రైలు పట్టాల వద్ద మృతదేహాన్ని పడేసింది. తండ్రి శ్రీనావాస్ రెడ్డి కూతుర్ని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో తానే ప్రియుడితో కలిసి తల్లిని చంపినట్లు కీర్తి అంగీకరించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories