బాలికలతో వెట్టిచాకిరీ, బాడీ మసాజ్... టీవీ యాంకర్‌పై కేసు నమోదు

బాలికలతో వెట్టిచాకిరీ, బాడీ మసాజ్... టీవీ యాంకర్‌పై కేసు నమోదు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ఇద్దరు బాలికలతో టీవీ యాంకర్ వెట్టి చాకిరీ చేయించుకుంటున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా నూజివీడులోని చైల్డ్ కేర్‌లో చదువుకుంటున్న ఇద్దరు...

ఇద్దరు బాలికలతో టీవీ యాంకర్ వెట్టి చాకిరీ చేయించుకుంటున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా నూజివీడులోని చైల్డ్ కేర్‌లో చదువుకుంటున్న ఇద్దరు బాలికల్ని పండుగ సెలవుల పేరుతో తల్లి హైదరాబాద్ తీసుకెళ్లింది. ఓ టీవీ యాంకర్ ఇంట్లో బాలికల్ని పనికి కుదిర్చింది. సెలవులు ముగిసినా బాలికలు చైల్డ్‌ కేర్‌కి తిరిగిరాకపోవడంతో సీసీఐ అధికారులు మిస్సింగ్ కేసు పెట్టారు. బాలికల మిస్సింగ్‌పై దర్యాప్తు చేయగా హైదరాబాద్‌లో టీవీ యాంకర్ ఇంట్లో వెట్టిచాకిరి చేస్తున్నట్టు శిశు సంక్షేమ కమిటీ గుర్తించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు బాలికల్ని శిశు సంక్షేమ కమిటీ సభ్యులు అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు బయటపడ్డాయి. ఇంటి పనితో పాటు యాంకర్ బాడీ మసాజ్ లాంటి పనులను సైతం వారితో చేయించుకుంటున్నట్లు బాలికలు తెలిపారు. దీంతో సీడబ్ల్యూసీ సభ్యుల ఫిర్యాదు మేరకు నూజివీడు పోలీసులు యాంకర్‌పై కేసు నమోదు చేశారు. మైనర్లని పనిలో పెట్టుకోవడం, వెట్టిచాకిరి చేయించుకోవడం చట్టరిత్యా నేరమని వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories