భర్త వేధింపులు .. తన పిల్లలకు విషమిచ్చి తానూ విషం తాగిన భార్య ..

భర్త వేధింపులు .. తన పిల్లలకు విషమిచ్చి తానూ విషం తాగిన భార్య ..
x
Highlights

మద్యానికి బానిసైన ఓ భర్త వేదింపులకు తట్టుకోలేక ఓ భార్య తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ పరిధిలోని పార్శీగుట్టలో...

మద్యానికి బానిసైన ఓ భర్త వేదింపులకు తట్టుకోలేక ఓ భార్య తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ పరిధిలోని పార్శీగుట్టలో చోటు చేసుకుంది .. అయితే ఇందులో భార్య చనిపోగా ఇద్దరు పిల్లల ప్రాణాల కోసం పోరాడుతున్నారు . ఇక వివరాల్లోకి వెళ్తే ప్రసాద్ మరియు అంజలికి గత కొద్ది కాలం కింద వివాహం అయింది వీరికి అనిరుద్ మరియు అమృత్ తేజ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు .

గత కొద్ది రొజులుగా పనికి దూరమై మద్యానికి బానిస అయ్యాడు ప్రసాద్ .. అంజలి ఓ ప్రైవేట్ స్కూల్ లో పని చేసుకుంటూ ఇంటి భారాన్ని మోస్తుంది . ఈ క్రమంలో తనకి తాగడానికి డబ్బులు ఇవ్వాలని ప్రసాద్ అంజలిని చితకబాదేవాడు. అంతేకాకుండా అక్రమ సంబంధం ఉందని అనుమానిచేవాడు. ఇవి క్రమేపి పెరుగుతూ ఉండడంతో అంజలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది . ఇరువురికి బేగంపేటలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు .

తాజాగా మళ్ళీ ఇలాంటి గొడవలే జరగడంతో అంజలి తన ఇద్దరు కుమారులకు కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇచ్చి తానూ తాగింది . పిల్లలు వాంతులు చేసుకోవడం గమనించిన ఇంటి యజమాని వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు . అయితే అంజలి విషం మోతాదు ఎక్కువగా తీసుకోవడంతో ఆమె మరణించింది . ఇద్దరి పిల్లల పరిస్థతి విషమంగా ఉంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories