భార్యపై పగ పెంచుకున్న భర్త.. సోషల్ మీడియా లో కాల్ గర్ల్ అంటూ ప్రచారం..

భార్యపై పగ పెంచుకున్న భర్త.. సోషల్ మీడియా లో కాల్ గర్ల్ అంటూ ప్రచారం..
x
Highlights

సంసారం అన్నాక గొడవలు కామన్.. ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని ముందుకు పోతేనే ఆ దాంపత్య జీవితం అనేది సరిగ్గా సాగుతుంది. కానీ ఓ భర్త మాత్రం తన భార్యతో తరుచు...

సంసారం అన్నాక గొడవలు కామన్.. ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని ముందుకు పోతేనే ఆ దాంపత్య జీవితం అనేది సరిగ్గా సాగుతుంది. కానీ ఓ భర్త మాత్రం తన భార్యతో తరుచు గొడవలు రావడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆమె పరువు తీయాలని అనుకున్నాడు. అందులో భాగంగానే ఆమె ఫోటోలను సేకరించి సోషల్ మీడియాలో కాల్ గర్ల్ గా చిత్రికరించి ఆమె ఫోన్ నెంబర్ ని అటాచ్ చేసాడు. దీనితో ఆ వివాహితకు వేధింపులు ఎక్కువ కావడంతో రాచకొండ . సైబర్ క్రైమ్ పోలీసులును ఆశ్రయించింది.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా తన భర్తే ఇలా చేసాడన్న విషయం బయటకు వచ్చింది. సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కుషాయిగూడలోని రాధికా థియేటర్ లో జాన్ జార్ట్ అనే వ్యక్తి ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్యతో కలిసి లక్ష్మి నగర్ లో కాపురం ఉంటున్నాడు. ఈ నేపధ్యంలో భార్యతో తరుచు గొడవలు కావడంతో ఆమెపై పగ పెంచుకొని ఆమెను ఓ కాల్ గర్ల్ గా సోషల్ మీడియాలో చిత్రికరిచాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories