ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానో లేదోనని బాలిక ఆత్మహత్య...

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానో లేదోనని బాలిక ఆత్మహత్య...
x
Highlights

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానో లేదోనని ఓ బాలిక (16) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఫలక్ నామా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి...

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానో లేదోనని ఓ బాలిక (16) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఫలక్ నామా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం బాలిక ఓ స్థానిక పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది. గత కొంత కాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తుంది. ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులుకు కూడా వివరించింది. తానూ ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలనీ కోరింది. దీనికి ఆమె తల్లి తండ్రులు కూడా ఒకే అన్నారు . కానీ ప్రస్తుతం నువ్వు మైనర్ అని మరో రెండేళ్ళలో మేజర్ అయ్యాక పెళ్లి చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఆమె ఓ ఖాజీని సైతం కలిసింది. అతను కూడా ఇదే విషయం చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక రెండేళ్ళ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో, ప్రేమించిన వ్యక్తితో పెళ్లి అవుతుందో లేదోనని సారీ మమ్మీ,డాడీ అంటూ లేఖలో పేర్కొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories