ఇద్ద‌రు తెలుగ‌మ్మాయిల‌తో విజ‌య్ ఆంటోని

ఇద్ద‌రు తెలుగ‌మ్మాయిల‌తో విజ‌య్ ఆంటోని
x
Highlights

త‌మిళ అనువాద చిత్రం 'బిచ్చ‌గాడు'తో క‌థానాయ‌కుడిగా త‌న‌కంటూ ఓ మార్కెట్‌ని సొంతం చేసుకున్నాడు విజ‌య్ ఆంటోని. ఆ సినిమా త‌రువాత ఆయ‌న న‌టించిన 'బేతాళుడు',...

త‌మిళ అనువాద చిత్రం 'బిచ్చ‌గాడు'తో క‌థానాయ‌కుడిగా త‌న‌కంటూ ఓ మార్కెట్‌ని సొంతం చేసుకున్నాడు విజ‌య్ ఆంటోని. ఆ సినిమా త‌రువాత ఆయ‌న న‌టించిన 'బేతాళుడు', 'య‌మ‌న్' స‌రైన ఫ‌లితాల‌ను ఇవ్వ‌లేక‌పోయాయి. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం విజ‌య్ ఆంటోని రెండు చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఆ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస‌న్ తెర‌కెక్కిస్తున్న 'అన్నాదురై' (తెలుగులో ఇంద్ర‌సేన‌)లో అన్నాదమ్ములుగా ద్విపాత్రాభిన‌యం చేస్తున్న విజ‌య్‌.. 'కాళి' అనే మ‌రో సినిమాలోనూ న‌టిస్తున్నాడు. దీనిని కృతికా ఉద‌య‌నిధి రూపొందిస్తున్నారు.

ఇందులో న‌లుగురు కథానాయిక‌లు న‌టిస్తుండ‌గా.. వారిలో ఇద్ద‌రు తెలుగ‌మ్మాయిలు కావ‌డం విశేషం. ఆ ఇద్ద‌రు మ‌రెవ‌రో కాదు అంజ‌లి, సునైనా. అంజ‌లి మ‌న‌కి సుప‌రిచిత‌మే.. ఇక‌ హైద‌రాబాద్‌లో పెరిగిన సునైనా నాలుగైదు తెలుగు చిత్రాల్లో ఇప్ప‌టికే న‌టించింది. త‌మిళంలోనే ఎక్కువ‌గా సినిమాలు చేస్తోందిప్పుడు. ఇక మిగిలిన ఇద్ద‌రు హీరోయిన్స్‌గా అమృత‌, శిల్పా మంజునాథ్ న‌టిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories