Whatsapp Classes for AP Gurukula Students: రెసిడెన్సియల్ విద్యార్థులకు వాట్స్ ప్ తరగతులు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

Whatsapp Classes for AP Gurukula Students: రెసిడెన్సియల్ విద్యార్థులకు వాట్స్ ప్ తరగతులు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం
x
Whatsapp Classes for AP Gurukula Students:
Highlights

Whatsapp Classes for AP Gurukula Students: కరోనా... ఈ 20వ శతాబ్ధంలో మరచిపోలేని సంఘటన ఉందంటే అది ఇదే.. దీనివల్ల ప్రపంచం మొత్తం ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలియని విషయం కాదు..

Whatsapp Classes for AP Gurukula Students: కరోనా... ఈ 20వ శతాబ్ధంలో మరచిపోలేని సంఘటన ఉందంటే అది ఇదే.. దీనివల్ల ప్రపంచం మొత్తం ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలియని విషయం కాదు... ఈ ఘటనను తరాలు పాటు చర్చించుకునేంత స్థాయిలో ఈ విపత్తు డ్యామేజీ చేసింది. విద్యా వ్యవస్థ అయితే కుదేలయినట్టే. అందరూ కలిసికట్టుగా క్లాసులకు వెళితే ఇక అంతే. అందుకే విద్యార్థుల స్థాయిని బట్టి వీలైనట్టుగా తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రెసిడెన్సియల్ విద్యార్థులకు వాట్స్ ప్ ద్వారా తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ తమ విద్యార్థులకు వాట్సాప్‌ క్లాసులు ప్రవేశపెట్టింది. గురుకుల కార్యదర్శి కల్నల్‌ వి.రాములు ఆదేశాల మేరకు ఈ విధానాన్ని గురుకులాల్లో టీచర్లు అమలు చేస్తున్నారు. కరోనా తీవ్రత కొనసాగుతున్న తరుణంలో సెలవుల అనంతరం కూడా విద్యార్థులను తిరిగి గురుకులాలకు పంపించేందుకు తల్లిదండ్రులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల దృష్టి చదువు నుంచి వేరే వ్యాపకాలవైపు మరలకుండా గురుకుల సంస్థ వాట్సాప్‌ క్లాసుల ప్రక్రియను ప్రారంభించింది. ఈ విధానం ద్వారా గురుకుల స్కూళ్లలో చదువుతున్న 1.5 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది.

క్లాసులు ఇలా..

► ఒక్కో తరగతికి ఒక్కో వాట్సాప్‌ గ్రూపు, గ్రూపులో 40 మంది విద్యార్థులు ఉండే విధంగా చర్యలు.

► సబ్జెక్ట్‌లో నిపుణులు, వాక్చాతుర్యం ఉండే ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. వారు క్లాసు చెప్పేటప్పుడు వీడియో తీస్తారు.

► ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి, వీడియో లింక్‌ను విద్యార్థుల స్మార్ట్‌ ఫోన్లకు పంపిస్తారు.

► లింక్‌ ద్వారా యూట్యూబ్‌లో వీడియోను ఓపెన్‌ చేసి క్లాసును విద్యార్థులు పూర్తిగా వినవచ్చు.

► విద్యార్థులు తమ అభిప్రాయాలు, సందేహాలను వాట్సాప్‌ గ్రూపులో టీచర్‌తో చర్చించవచ్చు.

లాటరీ ద్వారా అడ్మిషన్‌లు

ఈ సంవత్సరం గురుకుల స్కూళ్లలో కొత్తగా 5వ తరగతిలో చేరే విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు. ప్రతి సంవత్సరం పోటీ పరీక్ష పెట్టడం ద్వారా ఎంపిక జరిగేది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories