
గ్యాస్ లీక్ పేరు చెబితేనే విశాఖ గుర్తొచ్చేలా ఇటీవల ఘటన చోటుచేసుకుంది. దీంతో పాటు ఎక్కడ గ్యాస్ లీక్ అని పేరెత్తినా వెంటనే పరుగులు తీసేందుకు ప్రయత్నం...
గ్యాస్ లీక్ పేరు చెబితేనే విశాఖ గుర్తొచ్చేలా ఇటీవల ఘటన చోటుచేసుకుంది. దీంతో పాటు ఎక్కడ గ్యాస్ లీక్ అని పేరెత్తినా వెంటనే పరుగులు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇటువంటి వ్యవహరాలు గత కొన్నేళ్లుగా తరచూ చోటు చేసుకుంటున్నా ఇటీవల వీటిని చూసి బెంబేలెత్తి పోతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఇలాంటి ఘటనకు ప్రజలు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు వచ్చి సమస్యను పరిష్కరించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల చోటుచేసుకున్న విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి గ్యాస్ లీకేజీ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో మరోసారి గ్యాస్ లీక్ అయ్యింది. ఓఎన్జీసీ బావి పైపులైన్ నుంచి వచ్చే సహజ వాయువు స్వల్పంగా లీకైంది. నివాసగృహాలకు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు.
స్థానికులు వెంటనే ఓఎన్జీసీ, రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకుని బావి నుంచి గ్యాస్ ఉత్పత్తి కాకుండా నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత నెలలోనూ ఇదే ప్రాంతంలో రెండు సార్లు గ్యాసు లీకైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



