ఆహార లోపాన్ని అధిగమించండి

గిరిజన చిన్నారుల్లో పోషకాహార లోపానికి చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ పేర్కొన్నారు.

S. Srikanth
Published on: 28 Nov 2019 11:25 AM IST
ఆహార లోపాన్ని అధిగమించండి
X
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ

పాడేరు: గిరిజన చిన్నారుల్లో పోషకాహార లోపానికి చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సీడీపీవో లు, అంగన్వాడీ పర్యవేక్షణకు పోషణ అభియాన్ లో భాగంగా ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పీవో బాలాజీ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

అంగన్వాడీకి వచ్చే చిన్నారులకు అందుతున్న పోషకాహారంపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బాల్య దశలో పోషకాహార లోపాన్ని నివారించకపోతే మనిషి ఎదుగుదలను హరిస్తుందన్నారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు వైయస్సార్ సంపూర్ణ పోషణ సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. రోజుకోసారి అంగన్వాడీల పని తీరుపై సమీక్షీస్తానని అన్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story