ఏపీలో భారీగా తగ్గినా కరోనా కేసులు!

ఏపీలో భారీగా తగ్గినా కరోనా కేసులు!
x
Highlights

+: ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 61,330కరోనా టెస్టులు చేయగా, 2,918 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Coronavirus Update In AP: ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 61,330కరోనా టెస్టులు చేయగా, 2,918 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,86,050కి చేరుకుంది. అయితే ఇందులో 35,065 యాక్టివ్ కేసులుండగా, 7,44,532మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్కరోజే 4,303 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 24 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,453కి చేరుకుంది.

ఇక ఇప్పటివరకు ఎపీలో 71,27,533 కరోనా టెస్టులు నిర్వహించారు. కడపలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇక జిల్లాల వారిగా లెక్కలు చూసుకుంటే..అనంతపుర్ లో 212, చిత్తూరులో 380, ఈస్ట్ గోదావరిలో 468, గుంటూరులో 333, కడపలో 155, కృష్ణాలో 117, కర్నూల్ లో 66, నెల్లూరులో 119, ప్రకాశంలో 308, శ్రీకాకుళం 143, విశాఖపట్నం 120, విజయనగరం 44, వెస్ట్ గోదావరి 447 కేసులు నమోదు అయ్యాయి..


Show Full Article
Print Article
Next Story
More Stories