ఇళ్ల స్థలాల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు
ఇళ్ల స్థలాల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాది రోజు లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేయాలనుకుంటోన్న జగన్ సర్కార్ దాదాపు 40వేల ఎకరాల భూమి అవసరమని లెక్కగట్టింది. అయితే, 20వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండగా మరో 18వేల ఎకరాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ప్రైవేట్ భూముల కొనుగోలుకు 10వేల కోట్లు అవసరమని అంచనా వేసిన ప్రభుత్వం భూముల కొనుగోలుకు నిధులు సేకరించాలని ఆలోచిస్తోంది.
Next Story




