సరిహద్దు చెక్ పోస్టులు కొనసాగుతాయి : ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

సరిహద్దు చెక్ పోస్టులు కొనసాగుతాయి : ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
x
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ నుంచి అన్ లాక్ 01 నిబంధలను మార్చినా సరిహద్దు చెక్ పోస్టు లు యధాతధంగా కొనసాగుతాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ నుంచి అన్ లాక్ 01 నిబంధలను మార్చినా సరిహద్దు చెక్ పోస్టు లు యధాతధంగా కొనసాగుతాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కేవలం చికిత్సకు సంబంధించి కేంద్రం విధించిన షరతులు వర్తిస్తాయని పేర్కొంది.భవిషత్తులో సరిహద్దు చెక్ పోస్టుల్లో చెకింగ్ కొనసాగుతుందని పేర్కొంది.

అన్‌లాక్‌ 1లో భాగంగా రేపట్నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఎత్తివేయనున్నారని తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఏపీ నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు వెల్లడించారు. కోవిడ్ 19 మార్గదర్శకాల ప్రకారం సరిహద్దు చెక్‌పోస్టులను యధావిధిగా పర్యవేక్షిస్తామన్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరగడంతో ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, రైల్వేస్టేషన్స్, డొమెస్టిక్ ఎయిర్ పోర్టులలో మరికొన్ని రోజులు తనిఖీలు జరుగుతాయన్నారు.

ఏపీకి వచ్చేవారందరూ కూడా కచ్చితంగా స్పందన వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. పైన తెలిపిన చెక్ పాయింట్ల వద్ద అందరి వివరాలను నమోదు చేసుకుని ఆరోగ్యశాఖ ప్రోటోకాల్ ప్రకారం టెస్టులు చేస్తామన్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా కూడా 7 రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాలన్నారు. వీటిని అందరూ కూడా తప్పక గమనించాలని నోడల్ ఆఫీసర్ పేర్కొన్నారు. కాగా, అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం నుండి అనుమతి పొందిన తర్వాత హైదరాబాద్ నుండి జిల్లాలకు బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories