ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు!
x
Highlights

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 43,044 కరోనా టెస్టులు చేయగా 753 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 43,044 కరోనా టెస్టులు చేయగా 753 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,54,764 కి చేరుకుంది. అయితే ఇందులో 17,892 యాక్టివ్ కేసులుండగా 8,54,764 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,507 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 13 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6881 కి చేరుకుంది.

కోవిడ్ వలన చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నంలో ఇద్దరు.. అనంతపూర్, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పచ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కరు చోప్పున మరణించారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 4, చిత్తూరులో 87, ఈస్ట్ గోదావరిలో 130, గుంటూరులో 50, కడపలో 66, కృష్ణాలో 76, కర్నూల్ లో 12, నెల్లూరులో 14, ప్రకాశంలో 36, శ్రీకాకుళం 25, విశాఖపట్నం 25, విజయనగరం 12, వెస్ట్ గోదావరి 216 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 91,97,307 కరోనా టెస్టులు నిర్వహించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories