Coronavirus: ఏపీలో మరో 448 కరోనా పాజిటివ్‌ కేసులు

Coronavirus: ఏపీలో మరో 448 కరోనా పాజిటివ్‌ కేసులు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 448 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 448 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 36,047 శాంపిల్స్‌ని పరీక్షించగా 448 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 146 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా గడిచిన 24 గంటల్లో 10 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, శ్రీకాకుళం లో మరొకరు మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 8306. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 129. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3712కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 4465 మంది చికిత్స పొందుతున్నారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories