Armoor: జనం మధ్యకు మున్సిపల్ బాస్ పనుల ప్రారంభోత్సవం.. సమస్యల పరిశీలన
Armoor: ఆర్మూర్ 29వ వార్డులో నూతన సిసి రోడ్డు పనులను ప్రారంభించిన చైర్పర్సన్ గోనె లహరి రఘు. కమలా నెహ్రూ కాలనీలో, సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన చైర్పర్సన్.
Armoor: జనం మధ్యకు మున్సిపల్ బాస్ పనుల ప్రారంభోత్సవం.. సమస్యల పరిశీలన
ఆర్మూర్ న్యూస్: పట్టణంలోని 29వ వార్డులో నూతన సిసి రోడ్డు నిర్మాణానికి స్థానిక కౌన్సిలర్ తిరుమల సుమన్ భారత్ గ్యాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘు మరియు వైస్ చైర్మన్ కాటి పల్లి వెంకటరెడ్డి విచ్చేసి కొబ్బరికాయ కొట్టి నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది.
అనంతరం చైర్మన్,వైస్ చైర్మన్ లకు స్థానిక కౌన్సిలర్ తిరుమల ఆధ్వర్యంలో కమల నెహ్రూ కాలనీలో వాటర్ సమస్య డ్రైనేజ్ సమస్య పలు సమస్యలను కాలనీ అంతకు తిరిగి చైర్మన్గా దృష్టికి తీసుకురావడం జరిగింది, ఈ విషయంపై చైర్మన్ సమస్యలు చూసి పరిశీలించి, వెంటనే స్పందించి ఎప్పుడు పనిలో అప్పుడే చేయమని అక్కడ అధికారులకు సూచించింది, ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాషా, వినోద్ సాయిరాజ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.