Drishyam 3 OTT : 'దృశ్యం 3' ఏ ఓటీటీలోకి వస్తోందో తెలుసా.. దీంట్లోనే..!
Drishyam 3 OTT : మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ నటిస్తున్న మైండ్బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఇప్పటికే విడుదలైన..
drishyam 3
Drishyam 3 OTT : మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ నటిస్తున్న మైండ్బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ సిరీస్ నుండి రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘దృశ్యం 3’ (Drishyam 3) ఈ రోజు విడుదలైంది . సరిగ్గా మోహన్లాల్ పుట్టినరోజు రోజైన మే 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేశారు. అయితే, ఈ సినిమా వెండితెరపైకి రాకముందే దీనికి సంబంధించిన ఓటీటీ (OTT) హక్కుల డీల్ చాలా భారీ ధరకు లాక్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. సాధారణంగా ఉండే ట్రెండ్ ప్రకారమే, థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాతే ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టనుంది.
మోహన్లాల్ బర్త్డే గిఫ్ట్..
దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ కోసం మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మోహన్లాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి వస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. సినిమా కౌంట్డౌన్ ప్రారంభం కావడంతోనే ఫ్యాన్స్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టికెట్లను అడ్వాన్స్గా బుక్ చేసుకుని థియేటర్ల దగ్గర సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో మోహన్లాల్ సరసన మీనా, అలాగే ఎస్తేర్ అనిల్, అన్సిబా హసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ , పనోరమా స్టూడియోస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించాయి.
ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో? స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా, దీని ఓటీటీ డీల్ కోసం ప్రముఖ సంస్థలు పోటీ పడ్డాయి. అయితే, ‘దృశ్యం’ మొదటి రెండు భాగాలు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతుండటంతో, మూడో భాగం కూడా అదే ప్లాట్ఫామ్లో రానుంది. మేకర్స్ , ఓటీటీ ప్లాట్ఫామ్ మధ్య జరిగిన అగ్రిమెంట్ ప్రకారం.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత కనీసం 30 నుండి 35 రోజుల విండో పీరియడ్ను పాటించనున్నారు. అంటే, జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో ‘దృశ్యం 3’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్క్రీనింగ్కు వచ్చే అవకాశం ఉంది.
ట్విస్టుల పండగ.. ఈసారి జార్జ్కుట్టిని వెంటాడుతున్న ఆ 'మూడో' వ్యక్తి ఎవరు?
ఇటీవలే విడుదలైన ‘దృశ్యం 3’ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లింది. ఈసారి కథలో జీతూ జోసెఫ్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ప్రతిసారి జార్జ్కుట్టి (మోహన్లాల్) కుటుంబాన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తే.. ఈ మూడో భాగంలో పోలీసులకు బదులుగా ఎవరో ఒక అపరిచిత ‘మూడో వ్యక్తి’ జార్జ్కుట్టి వెనుక పడినట్లు ట్రైలర్లో చూపించారు. తన కుటుంబాన్ని అసలు ఎవరు ఇరికించాలని చూస్తున్నారో తెలియక జార్జ్కుట్టి గందరగోళంలో పడతాడు. ఈ రహస్య శత్రువు ఎవరు? అతని నుంచి జార్జ్కుట్టి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనే ఆసక్తికరమైన గుట్టు విప్పడమే ‘దృశ్యం 3’ ముఖ్య కథాంశం.