Tamil Nadu: సీఎం విజయ్తో సెల్ఫీ వివాదం.. అసలు నిజం బయటపెట్టిన సిమ్మచంద్రన్!
Tamil Nadu: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్తో దివ్యాంగుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు సిమ్మచంద్రన్ తీసుకున్న సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Tamil Nadu: సీఎం విజయ్తో సెల్ఫీ వివాదం.. అసలు నిజం బయటపెట్టిన సిమ్మచంద్రన్!
Tamil Nadu: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ను దివ్యాంగుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు సిమ్మచంద్రన్ కలిసిన సందర్భంగా తీసుకున్న ఒక సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కీలకమైన సమాలోచనలు జరుపుతున్న సమయంలోనే ఈ వీడియో తీసినట్లు ప్రచారం జరగడంతో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సదరు సెల్ఫీ వీడియో వ్యవహారంపై సిమ్మచంద్రన్ స్పందిస్తూ అధికారిక వివరణ ఇచ్చారు.
గత 35 ఏళ్లుగా తాము ఎంతోమంది ముఖ్యమంత్రులను కలిశామని, కానీ ప్రతిసారీ ఒక రకమైన భయంతోనే వారితో మాట్లాడాల్సి వచ్చేదని సిమ్మచంద్రన్ గుర్తుచేసుకున్నారు. అయితే, కొత్త సీఎం జోసెఫ్ విజయ్ను కలిసినప్పుడు మాత్రం తమకు ఎంతో సౌకర్యవంతమైన వాతావరణం కనిపించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
"నేను సెల్ఫీ వీడియో తీస్తున్న విషయం ముఖ్యమంత్రి విజయ్ గారికి ముందే తెలుసు. దానికి ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు, మమ్మల్ని వారించనూ లేదు. ఆయన ఇచ్చిన చొరవతోనే ఆ వీడియో తీశాం. అయితే, అక్కడ ఉన్న సమాచార పౌర సంబంధాల అధికారులు మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా ఆ వీడియో గురించి మమ్మల్ని ప్రశ్నించారు" అని సిమ్మచంద్రన్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి విజయ్ చూపిన ఆప్యాయత, సరళత వల్లే తాము అంత స్వేచ్ఛగా వీడియో తీసుకోగలిగామని, దీనిని వివాదం చేయాల్సిన అవసరం లేదని దివ్యాంగుల సంఘాల సమాఖ్య ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వివరణతో నెట్టింట జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది.