Pulivendula: ధైర్యముంటే ఆగస్టు 17న అసెంబ్లీకి రండి: వైఎస్ జగన్కు ఎమ్మెల్సీ భూమిరెడ్డి సవాల్!
Pulivendula: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Pulivendula: ధైర్యముంటే ఆగస్టు 17న అసెంబ్లీకి రండి: వైఎస్ జగన్కు ఎమ్మెల్సీ భూమిరెడ్డి సవాల్!
పులివెందుల: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్, డీఎస్సీ స్పోర్ట్స్ కోటలో ఎక్కడ అవకతవకలు జరగలేదు, డీఎస్సీ రాసిన అభ్యర్థులు తాము నష్టపోయామని వైఎస్ఆర్సిపి చేస్తున్న ధర్నాలలో ఎక్కడ గాని పాల్గొనలేదన్నారు. వైయస్ జగన్ ప్రతిదీ చర్చిద్దాం 17 వ తేదీన అసెంబ్లీ సమావేశాలకు రండి, నిజంగా అన్యాయం జరిగితే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు.
ఏలినో ప్రభావం పై చర్చించి రైతులను కాపాడుదాం వైయస్ఆర్సీపీ పార్టీకి చెందిన ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించి డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా లో ఉద్యోగాలు వచ్చాయి అర్హతను బట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా వారి వ్యాపారాలు వారి సొంత పనులు చూసుకోవాలన్నారు.
డీఎస్సీ అభ్యర్థులకు నిజంగా అన్యాయం జరిగింటే వారే స్వయంగా వచ్చి వైఎస్సార్సీపి ర్యాలీలల్లో పాల్గొనే వారని, అవకతకలు జరగలేదు కాబట్టి డిఎస్సి పరీక్ష రాసిన అభ్యర్థులు ఎవరే కానీ వైఎస్ఆర్సిపి ధర్నాలలో పాల్గొన్నారు.