Medipally: బైక్ చోరీలకు పాల్పడుతున్న 14 ఏళ్ల బాలుడి పట్టివేత!

Medipally: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న 14 ఏళ్ల బాలుడిని క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు.

Update: 2026-08-17 13:12 GMT

Medipally: బైక్ చోరీలకు పాల్పడుతున్న 14 ఏళ్ల బాలుడి పట్టివేత!

మేడిపల్లి: ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న 14 ఏళ్ల బాలుడిని మేడిపల్లి పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి నాలుగు చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ డి. జెలెండర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి చెంగిచెర్లకు చెందిన బాలుడు గత నెల రోజులుగా తన వ్యక్తిగత అవసరాల కోసం నాలుగు ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. చోరీ చేసిన వాహనాలను విక్రయించేందుకు వీలుగా ఓ బహిరంగ ప్రదేశంలో దాచిపెట్టినట్లు బాలుడు తెలిపాడు. విశ్వసనీయ సమాచారంతో మేడిపల్లి క్రైమ్‌ టీమ్‌ బాలుడిని గుర్తించి పట్టుకుంది.

అతడి సమాచారంతో బహిరంగ ప్రదేశంలో దాచిన నాలుగు చోరీ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చట్టపరమైన ప్రక్రియలో భాగంగా బాలుడికి నోటీసు జారీ చేసి, తదుపరి చర్యల కోసం బాల న్యాయ బోర్డు (Juvenile Justice Board) ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. ఈ ఆపరేషన్‌లో డీఎస్‌ఐ శ్రీను, ఏఎస్ఐ బాలసింగ్, హెచ్‌సీలు సునీల్, రాము, పీసీలు మహిపాల్, వినోద్, హరిబాబు, శివకుమార్, డబ్ల్యూఫీసీ విశాలి పాల్గొన్నారు. క్రైమ్‌ టీమ్‌ పనితీరును ఉన్నతాధికారులు అభినందించారు.

Tags:    

Similar News