Nellore: 2 అడుగుల చెట్టుకు 200 నారింజ కాయలు!

Nellore: నెల్లూరులోని నర్సరీలో థైలాండ్ బోన్సాయ్ ఆరెంజ్ చెట్టు సందడి చేస్తోంది.

Update: 2026-08-12 05:33 GMT

Nellore: 2 అడుగుల చెట్టుకు 200 నారింజ కాయలు!

Nellore: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఒక అరుదైన నారింజ చెట్టు స్థానికులను, పకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం 2 నుంచి 3 అడుగుల ఎత్తు ఉన్న బోన్సాయ్ చెట్టుకు దాదాపు 50 నుండి 200 వరకు నారింజ కాయలు కాస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

నెల్లూరులోని కేవిఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న 'బృందావన్ గార్డెన్స్ అండ్ నర్సరీస్' నిర్వాహకుడు చైతన్య, ఈ 'థైలాండ్ వెరైటీ' బోన్సాయ్ ఆరెంజ్ మొక్కలను ప్రత్యేకంగా విదేశాల నుండి తెప్పించారు. సాధారణంగా పెద్ద చెట్లకు మాత్రమే ఆ స్థాయిలో కాయలు కాస్తాయి, కానీ ఈ అరుదైన బోన్సాయ్ రకానికి ప్రతి ఆరు నెలలకొకసారి (ఏడాదికి రెండు సార్లు) విపరీతమైన కాపు వస్తుందని నర్సరీ నిర్వాహకులు తెలిపారు.

ఈ మొక్కల ప్రత్యేకతలు:

చిన్న కుండీలు లేదా కంటైనర్లలో పెంచే ఈ చెట్టు 1.5 అడుగుల నుండి గరిష్టంగా 6 అడుగుల వరకు మాత్రమే పెరుగుతుంది. కొమ్మ కొమ్మకూ కాయలతో నిండిపోతుంది.

కాయలు ఎంతో తీయగా ఉంటాయి. పూత, పిందే దశ నుంచి కాయ మాగడానికి దాదాపు 4 నెలల సమయం పడుతుంది. అంతవరకు ఈ కాయలు చెట్టుకే ఉండి ఆర్టిఫిషియల్ చెట్టులా చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.

విదేశీ వెరైటీ కావడంతో మార్కెట్‌లో ఈ బోన్సాయ్ ఆరెంజ్ చెట్ల ప్రారంభ ధర రూ. 7,500 నుండి రూ. 16,000 వరకు పలుకుతోంది.

ఈ వింత బోన్సాయ్ చెట్టును చూడటానికి నర్సరీకి భారీ సంఖ్యలో కస్టమర్లు తరలివస్తున్నారు. కాయలతో నిండి ఉన్న ఈ చెట్టుతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Full View

Tags:    

Similar News