YS Sharmila: జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్ట్ అని గాంధీ భవన్ మొత్తం తెలుసు

YS Sharmila: ఉదయం టీఆర్‌ఎస్, మధ్యాహ్నం బీజేపీ, సాయంత్రం కాంగ్రెస్.. ఎవడు పిలిస్తే అక్కడికి వెళ్తాడు జగ్గారెడ్డి

Update: 2022-09-26 12:30 GMT

YS Sharmila: జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్ట్ అని గాంధీ భవన్ మొత్తం తెలుసు

YS Sharmila: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్ట్ అని గాంధీ భవన్ మొత్తం తెలుసని అన్నారు. పార్టీలు మారి రాజకీయ వ్యభిచారం చేసే సంస్కృతి YSRకు లేదనిచెప్పారు. ఉదయం టీఆర్‌ఎస్, మధ్యాహ్నం బీజేపీ, సాయంత్రం కాంగ్రెస్.. ఎవడు పిలిస్తే అక్కడికి జగ్గారెడ్డి వెళ్తాడని షర్మిల ఆరోపించారు. ఒక్క ఎకరాకు అయినా జగ్గారెడ్డి నీళ్లు ఇచ్చాడా అని షర్మిల ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నాడు.. రేపు ఏ పార్టీలో ఉంటాడో జగ్గారెడ్డికే క్లారిటీ లేదని తీవ్ర విమర్శలు చేశారు షర్మిల.

Tags:    

Similar News