వెనక్కు తగ్గిన యాదాద్రి ఆలయ డెవలప్మెంట్ అథారిటీ..చిత్రాలు తొలగించాలని నిర్ణయం
ఎట్టకేలకు యాదాద్రి ఆలయం డెవలప్మెంట్ అథారిటి దిగొచ్చింది. ఆలయ ప్రాకారాలపై చెక్కిన పలు చిత్రాలను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా ఇతర ప్రముఖుల చిత్రాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆలయ ప్రాకారాలపై ప్రతిపక్షాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తుండటంతో వైటీడీఏ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.