Dhanpal Suryanarayana: రాష్ట్రంలో బీజేపీకి 12 సీట్లు రావడం ఖాయం

Dhanpal Suryanarayana: మోడీ పై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు

Update: 2024-04-27 10:32 GMT

Dhanpal Suryanarayana: రాష్ట్రంలో బీజేపీకి 12 సీట్లు రావడం ఖాయం 

Dhanpal Suryanarayana: పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. దేశంలో మోడీ హయాంలో అవినీతి మచ్చ లేని పాలన సాగుతుందన్నారు. గత 60ఏళ్లుగా కాంగ్రెస్ హయాం అంతా కుంభకోణాల మాయంగా మారిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలతో గద్దెనెక్కి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఎన్నికల తర్వాత దేశంలో రాబోయేది మోడీ ప్రభంజనమే అంటున్న ధన్‌పాల్ సూర్యానారాయణ.

Tags:    

Similar News