Komatireddy Venkat Reddy: కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా.. రోడ్లను మెరుగుపరుస్తాం

Komatireddy Venkat Reddy: మల్కాపురం నుంచి సూర్యాపేటకు 6 లేన్ల రోడ్డు పనులు చేయాలి

Update: 2023-12-10 06:25 GMT

Komatireddy Venkat Reddy: కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా.. రోడ్లను మెరుగుపరుస్తాం

Komatireddy Venkat Reddy: రాష్ట్రంలో రోడ్లను మెరుగు పరుస్తామని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం దగ్గర సుందరీకరణ పనులు చేపడుతామని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తానని తెలిపారు.ఎల్బీనగర్‌ నుంచి మల్కాపురం వరకు ..మల్కాపురం నుంచి సూర్యాపేటకు 6 లేన్ల రోడ్డు పనులు చేయాలన్నారు. ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు సచివాలయంలో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Tags:    

Similar News