కరోనా వ్యాప్తి నేపథ్యంలో వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో వైరాలజీ ల్యాబ్ ప్రారంభమైంది. 1.73కోట్లతో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్ను రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాఠోడ్ ఈ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దయాకర్, మేయర్ గుండా ప్రకాష్ , ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ల్యాబ్ ద్వారా ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన కరోనా కేసులను పరీక్షించనున్నారు.