Vijayashanti: కేసీఆర్‌ బీబీసీ తీసుకుని మోసపోవద్దు..

Vijayashanti: సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Update: 2022-08-21 13:00 GMT

Vijayashanti: కేసీఆర్‌ బీబీసీ తీసుకుని మోసపోవద్దు..

Vijayashanti: సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రతి ఎన్నిక సమయంలో కేసీఆర్ బీబీసీని తీసుకువస్తారన్నారు. బ్రాండీ, బిర్యానీ, కరెన్సీనీ ఎరగా వేస్తుంటారన్నారు. ఎన్నికల్లో కేసీఆర్‌ ఇచ్చే బీబీసీ తీసుకుని మోస పోవద్దని విజయశాంతి మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అమరవీరుల కలలను తుంగలొ తొక్కిన కేసీఆర్ ను ప్రజలు సమర్దించాల్సిన అవసరం ఏముందని విజయశాంతి ప్రశ్నించారు. కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పోరాడేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. ప్రధాని మోడీ కేసీఆర్ కు శత్రువు కావొచ్చు కానీ దేశ ప్రజలందరీకి మోడీ నమ్మదగిన మిత్రుడన్నారు. 

Full View


Tags:    

Similar News