Vidyasagar Rao: మాతృభాషా దినోత్సవానికి హాజరైన విద్యాసాగరరావు

Vidyasagar Rao: తెలుగు భాష కోసం జిల్లాకో పీఠం ఏర్పాటు చేయాలి

Update: 2022-02-21 12:37 GMT

 మాతృభాషా దినోత్సవానికి హాజరైన విద్యాసాగరరావు

Vidyasagar Rao: హైదరాబాద్ బేగంపేట లోని హరిత ప్లాజాలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరిగింది. అక్షరయాన్ కవయిత్రుల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. మాతృభాష కోసం కృషి చేసిన పలువురిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ కనీసం మొదటి ఐదేళ్లయినా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని, దీన్ని ఒక ఉద్యమంలా తీసుకోవాలన్నారు. తెలుగు భాషకు, తెలుగు కవులను ప్రోత్సాహించడానికి ప్రతి జిల్లాలో ఒక పీఠం పెట్టాలని సూచించారు. 

Tags:    

Similar News