విజయవాడ కనక దుర్గమ్మ ఆలయాన్ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు దర్శించకున్నారు. యురేనియం తవ్వకాలు ఆపాలి, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే రెండు కోరికలు కోరుకున్నట్టు వీహెచ్ తెలిపారు. దసరా ఏర్పాట్లు తొలి రోజు బాగానే ఉంటాయని.. అయితే చివరి రోజు అసలు విషయం తెలుస్తుందని చెప్పారు. తన వరకు దర్శనం బాగానే జరిగిందని.. తాను వీఐపీ అలాగే నోరు ఉండటంతో త్వరగా పంపించారని.. మిగిలిన వాళ్లను కూడా అలానే పంపాలని అయన అన్నారు.