ఆసుపత్రి ఎండీ ఆత్మహత్య.. సూసైడ్‌కు ముందు తన డైరీలో నలుగురి పేర్లు !

Update: 2020-02-04 07:11 GMT
ఆసుపత్రి ఎండీ ఆత్మహత్య.. సూసైడ్‌కు ముందు తన డైరీలో నలుగురి పేర్లు !

హైదరాబాద్ ఎల్బీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. వైష్ణవి ఆస్పత్రి ఎండీ అజయ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సూసైడ్‌కు ముందు తన డైరీలో నలుగురి పేర్లు వ్రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అజయ్‌ రాసిన లేఖలో తుర్కయాంజల్‌కు చెందిన కొత్త కురుమ శివకుమార్‌, ఆస్పత్రి బిల్డింగ్‌ ఓనర్‌ కరుణాకర్‌ రెడ్డి, ఓనర్‌ బావమరిది కొండల్‌ రెడ్డి, సరస్వతి నగర్‌ కాలనీ ప్రెసిడెంట్‌ మెగారెడ్డి పేర్లు ఉన్నాయి.

వీరంతా మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అజయ్‌ లేఖలో పేర్కొన్నారు. అజయ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు, సూసైడ్ నోట్‌లో అతడు పేర్కొన్న వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. మృతుడు బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బందిని ఈ ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News