గాంధీభవన్లో పీసీసీ నాయకత్వంపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక విషయాలు చర్చించే కోర్ కమిటీ సమావేశంలో సభ్యులు కాని వారు వచ్చారంటూ మండిపడ్డారు. ఇతరులు వచ్చారని తాను బయటకు వచ్చానన్నారు వీహెచ్. కోర్ కమిటీలో ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, సంపత్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ మాత్రమే ఉంటారని తెలిపారు. కోర్ కమిటీలో ఉండాల్సిన సభ్యులు కాకుండా, ఇతరులు కూడా సమావేశానికి హాజరవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరు పడితే వాళ్లు కోర్ కమిటీ సమావేశాల్లో కూర్చుంటే ఇక కోర్ కమిటీ నిర్ణయాలకు విలువ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.